ఎన్ఆర్ఐలకు గుడ్న్యూస్.. ఆ కాలాన్ని లెక్కించరట
లాక్డౌన్ వల్ల మన దేశంలో చిక్కుకుపోయి.. టాక్స్ రిటర్నులు దాఖలు చేయాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్న ఎన్ఆర్ఐలకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 6ను ఉపయోగించుకుని..
లాక్డౌన్ వల్ల మన దేశంలో చిక్కుకుపోయి.. టాక్స్ రిటర్నులు దాఖలు చేయాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్న ఎన్ఆర్ఐలకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 6ను ఉపయోగించుకుని.. లాక్డౌన్ వల్ల వారు దేశంలో ఉన్న రోజులను పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. విమాన సేవల పునరుద్ధరణ జరిగిన అనంతరం.. గడువు పెంపును మినహాయించి వీరి నివాస కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.
గత సంవత్సరం 2019-2020లో అనేక మంది విదేశీయులు వివిధ పనుల మీద భారత్కు వచ్చారు. తమ ఎన్ఆర్ఐ గుర్తింపుపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండటానికి.. గత ఆర్థిక సంవత్సరంలోనే వెనక్కి వెళ్లిపోవాలని భావించారు. కానీ లాక్డౌన్ కారణంగా వారిలోని చాలా మంది దేశంలో చిక్కుకుపోయారు. సంవత్సర కాలంలో ఓ వ్యక్తి ఎన్ని రోజుల పాటు దేశంలో ఉన్నాడనే దానిపై అతడు భారత దేశస్థుడా? లేక ఎన్ఆర్ఐనా? అన్న విషయంపై ఆధారపడి ఉంటుంది.
Read More:
ఈ రోజు రాత్రికే గుడిలో ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో పెళ్లి..
గుండెపోటుతో యంగ్ డైరెక్టర్ మృతి.. షాక్లో సినీ ప్రముఖులు
బ్రేకింగ్: భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
‘ఏరా నాకు రెమ్యునరేషన్ ఇస్తావా’.. చిరు గురించి చెబుతూ లైవ్లో ఏడ్చేసిన శరత్ కుమార్