PM Narendra Modi: జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ

PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీజాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు.

PM Narendra Modi: జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ
Pm Modi
Follow us

|

Updated on: Apr 20, 2021 | 9:06 PM

ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది సేపట్లో జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. కోవిడ్ రెండో వేవ్ విరుచుకుపడుతున్న వేళలో ప్రధాని మోడీ ఈరోజు రాత్రి 8:45 గంటలకు తన సందేశాన్ని వినిపిస్తున్నారు. ఇప్పటికే కరోనా ఇబ్బందుల నేపధ్యంలో పలు కీలక చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. మరిన్ని చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తుందని చెబుతున్నారు. కరోనా టీకా 18 ఏళ్ల పైబడిన వారికీ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోవిడ్ నియంత్రణ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు ప్రధాని తన ప్రసంగంలో ఏమి చెబుతారో అనే ఆసక్తి అందరిలో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఏది ఏమైనా ఈ విపత్కర పరిస్థితిలో ప్రధాని మోడీ ఎం చెబుతారో అని జాతి మొత్తం ఆసక్తి తొ ఎదురు చూస్తోంది.

ప్రధాని మోడీ తన సందేశంలో ప్రస్తుతం కరోనా పరిస్థితులు.. వ్యాక్సినేషన్ ప్రక్రియ..ఆక్సిజన్ సరఫరా.. అదేవిధంగా లాక్ డౌన్ కు సంబంధించిన విషయాలను ప్రస్తావించే అవకాశం ఉంది. గత రెండు రోజులుగా వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించిన ప్రధాని మోడీ.. ఈరోజు అన్ని విషయాలను ప్రజల ముందుంచే అవకాశం కనిపిస్తోంది.

ప్రధాని మోడీ ప్రసంగాన్ని ఇక్కడ మీరు లైవ్ లో చూడవచ్చు..

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.