AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అశోకా పార్కులో చదును చేస్తుండగా అద్భుతం బయటపడింది.. తీరా చూస్తే అది 400ఏళ్ల నాటి..

శైవులు శివుడిని, వైష్ణవులు విష్ణువును, జైనులు తీర్థంకరులను పూజించడం సర్వసాధారణం. శైవులు తమ భూమి సరిహద్దుల్లో లింగ ముద్ర రాళ్లను అమర్చగా వైష్ణవులు వామన ముద్ర రాళ్లను, జైనులు ముక్కోడే రాళ్లను ఉపయోగించారు.

అశోకా పార్కులో చదును చేస్తుండగా అద్భుతం బయటపడింది.. తీరా చూస్తే అది 400ఏళ్ల నాటి..
Linga Mudra Stone F
Jyothi Gadda
|

Updated on: Mar 14, 2023 | 6:32 PM

Share

కర్నాటకలోని ఉడిపి జిల్లాలో సూర్యుడు, చంద్రుడు, శివలింగం, నంది శాసనాలతో కూడిన ‘లింగ ముద్ర’ రాయిని గుర్తించారు పురావస్తు శాస్త్రవేత్తలు. కుందాపురా తాలూకాలోని బస్రూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అశోకా పార్కులో చదును చేస్తుండగా 400 ఏళ్ల నాటి రాయి దొరికింది. స్థానికుల సహకారంతో దాన్ని తొలగించారు. ఈ విషయాన్ని ఓ చరిత్రకారుడి దృష్టికి తీసుకెళ్లారు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం నాటి రాజు రాజ్యం జీవించేదని రాయిపై ఉన్న సందేశం సూచిస్తోందని చరిత్రకారుడు ప్రొ. టి. మురుగేశి తెలిపారు.

శైవులు శివుడిని, వైష్ణవులు విష్ణువును, జైనులు తీర్థంకరులను పూజించడం సర్వసాధారణం. శైవులు తమ భూమి సరిహద్దుల్లో లింగ ముద్ర రాళ్లను అమర్చగా వైష్ణవులు వామన ముద్ర రాళ్లను, జైనులు ముక్కోడే రాళ్లను ఉపయోగించారు. ఇది వారి భూమి సరిహద్దులను గుర్తించే మార్గం. దీని ప్రకారం, బస్రూర్‌లో దొరికిన లింగ ముద్ర రాళ్లను సరిహద్దు గుర్తుగా ఉంచారని ప్రొ. మురుగేశి వివరించారు.

Linga Mudra Stone

Linga Mudra Stone

మురుగేశి మాట్లాడుతూ చారిత్రక శిలా శాసనాలు, యుద్ధ స్మారక చిహ్నాలు, సరిహద్దు రాళ్లను పరిరక్షించి మన నేల చరిత్రలో రికార్డు నెలకొల్పేందుకు ప్రజల సహకారం, తోడ్పాటు అవసరమన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..