AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ (ఆర్జేడీ) లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని వైద్యులు తెలిపారు. దీంతో పాటు బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ కూడా నిలకడగా లేవని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన దాణా స్కాంలో.. బిర్సా ముండా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే లాలూ ప్రసాద్.. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో.. రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్‌లో ప్రస్తుతం చికిత్స […]

క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 01, 2019 | 10:32 AM

Share

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ (ఆర్జేడీ) లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని వైద్యులు తెలిపారు. దీంతో పాటు బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ కూడా నిలకడగా లేవని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన దాణా స్కాంలో.. బిర్సా ముండా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే లాలూ ప్రసాద్.. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో.. రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పశుగ్రాసం కుంభకోణంలో దోషిగా తేలారు. దీంతో 2017 నుంచి ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్నారు.

రిమ్స్‌లో లాలూ చేరినప్పటి నుంచి ఆయనకు డాక్టర్ డీకే ఝా వైద్యచికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం లాలూకి బ్లడ్ ఇన్‌పెక్షన్ శరీరంలో వ్యాపించిందని, దాదపు 63శాతం కిడ్నీ దెబ్బతిందని.. 37 శాతం మాత్రమే సరిగా పనిచేస్తోందని డాక్టర్ ఝా తెలిపారు. యాంటీ బయోటిక్ మెడిసన్లు కారణంగా కూడా ఆయన కిడ్నీ పనితీరు మందగించిందన్నారు. లాలూ తీసుకునే డయిట్ కూడా గతంలో కంటే తగ్గిందని, ప్రస్తుతం మందులు ఇస్తున్నామని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యబృందంలో ఒకరైన డాక్టర్ ఉమేష్ ప్రసాద్ తెలిపారు.