AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: భారతదేశంలోని ఏకైక శాఖాహార రైలు.. ఇక్కడ ప్యూర్ వెజ్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది..

రైలు ప్రయాణ సమయంలో చాలా మంది ప్రయాణికులకు అక్కడ వడ్డించే ఆహారం నచ్చదు. రైళ్లలో వడ్డించే ఆహారం ఆరోగ్యకరమైనది కాదని భావిస్తున్నారు. ఆహారం తయారుచేసేటప్పుడు సరైన పరిశుభ్రత పాటించడం లేదని, శాఖాహారం, మాంసాహార వంటకాలను విడివిడిగా వండరని ప్రయాణికులు అంటుంటారు. కానీ ఒక రైలు తన ప్రయాణీకులకు శాఖాహార ఆహారాన్ని మాత్రమే అందిస్తుంది. అది ఏ రైలు, దాని వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

Indian Railway: భారతదేశంలోని ఏకైక శాఖాహార రైలు.. ఇక్కడ ప్యూర్ వెజ్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది..
vegetarian train
Jyothi Gadda
|

Updated on: Mar 11, 2025 | 11:50 AM

Share

భారతదేశంలో రైలు ప్రయాణం ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. ఆ అనుభవాన్ని మరింతగా పెంచేది అక్కడ అందుబాటులో లభించే ఆహారం..రైలు ప్రయాణం అనేది రద్దీగా ఉండే స్టేషన్ల నుండి స్థానిక విక్రేతలు, IRCTC నిర్వహించే పాంట్రీ సేవల వరకు ఒక ప్రత్యేక ప్రయాణం. రైలు ప్రయాణ సమయంలో చాలా మంది ప్రయాణికులకు అక్కడ వడ్డించే ఆహారం నచ్చదు. రైళ్లలో వడ్డించే ఆహారం ఆరోగ్యకరమైనది కాదని భావిస్తున్నారు. ఆహారం తయారుచేసేటప్పుడు సరైన పరిశుభ్రత పాటించడం లేదని, శాఖాహారం, మాంసాహార వంటకాలను విడివిడిగా వండరని ప్రయాణికులు అంటుంటారు. కానీ ఒక రైలు తన ప్రయాణీకులకు శాఖాహార ఆహారాన్ని మాత్రమే అందిస్తుంది. అది ఏ రైలు, దాని వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

కేవలం శాఖాహారం మాత్రమే సప్లై చేస్తున్న మొదటి రైలు ఇది. ఢిల్లీ నుండి జమ్మూ కాశ్మీర్‌లోని కాట్రా వరకు నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కేవలం శాఖాహార భోజనాన్ని మాత్రమే అందిస్తుంది. భారతదేశం మెనూలో కేవలం శాఖాహారం మాత్రమే ఉన్న మొదటి రైలు ఇది. ఢిల్లీ-కత్రా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతదేశపు మొట్టమొదటి పూర్తిగా శాఖాహార రైలు. ప్రయాణీకులకు శాఖాహార భోజనాన్ని మాత్రమే అందిస్తోంది. ఇందులో పూర్తిగా శాఖాహార వాతావరణాన్ని కొనసాగించడానికి ప్రయాణీకులు సైతం రైలులో ఎలాంటి మాంసాహారం, లేదా చిరుతిళ్లు తీసుకెళ్లడం కూడా నిషేధించబడింది. ఈ రైలులో దూర ప్రయాణాలు చేసే ప్రయాణీకులకు శాఖాహార భోజనం మాత్రమే వడ్డిస్తారు. మాంసం, గుడ్లు వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు.

భారత రైల్వే అథారిటీ IRCTC, భారతదేశానికి చెందిన NGO సాత్విక్ మండేలా మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా సాత్విక్ సర్టిఫికేట్ పొందిన ఏకైక రైలు ఢిల్లీ-కత్రా వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఇది న్యూఢిల్లీ (NDLS), శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా (SVDK) మధ్య నడిచే సెమీ-హై-స్పీడ్ రైలు.

ఇవి కూడా చదవండి

శాఖాహార అనుకూల ప్రయాణాన్ని ప్రోత్సహించడమే IRCTC లక్ష్యం:

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సాత్విక్-సర్టిఫైడ్” కొన్ని రైళ్ల ద్వారా శాఖాహార-స్నేహపూర్వక ప్రయాణాన్ని ప్రోత్సహిస్తుంది. మతపరమైన ప్రదేశాలను అనుసంధానించే మార్గాల్లో నడిచే రైళ్లను సాత్విక ఆహారాన్ని అందించే రైళ్లుగా మార్చారు. ఇండియన్ సాత్విక్ కౌన్సిల్ 2021లో IRCTCతో కలిసి సాత్విక్ సర్టిఫికేషన్ పథకాన్ని ప్రారంభించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ వివాదంపై నోరు విప్పిన యెషా సాగర్..
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ వివాదంపై నోరు విప్పిన యెషా సాగర్..
ఆ బూత్ బంగ్లాలో నిజంగా దెయ్యమా? శాస్త్రవేత్తలు చెప్పిన అసలు నిజం!
ఆ బూత్ బంగ్లాలో నిజంగా దెయ్యమా? శాస్త్రవేత్తలు చెప్పిన అసలు నిజం!
నేను ఎవరికీ వ్యతిరేకం కాదు..అలాగనీ నా పోరాటం ఆపను.. యాంకర్ రష్మీ
నేను ఎవరికీ వ్యతిరేకం కాదు..అలాగనీ నా పోరాటం ఆపను.. యాంకర్ రష్మీ
రూ.15 కోట్లతో నిర్మిస్తే రూ.230 కలెక్షన్స్.. థియేటర్లలో బ్లాక్ బస
రూ.15 కోట్లతో నిర్మిస్తే రూ.230 కలెక్షన్స్.. థియేటర్లలో బ్లాక్ బస
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ట్విస్ట్..!
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ట్విస్ట్..!
వదిన కోరిక తీర్చలేదు.. తోడల్లుడు అప్పు ఇవ్వలేదు.. చివరకు
వదిన కోరిక తీర్చలేదు.. తోడల్లుడు అప్పు ఇవ్వలేదు.. చివరకు