TV9 WITT Summit 2026: ఒవైసీ అర్ధం చేసుకోవాలి.. ఆ ఆరోపణలపై స్పందించిన కిషన్ రెడ్డి.. ఏమన్నారో తెలుసా..?
ఇంధన రంగం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. టీవీ9 నెట్వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యాలు చేశారు.

ఇంధన రంగం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. టీవీ9 నెట్వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యాలు చేశారు. 2014కు ముందు బొగ్గు విషయంలో సమస్యలు ఉండేవని, నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత బొగ్గు కేటాయింపులపై ఎలాంటి ఆరోపణలు లేవని ఆయన అన్నారు. తాము పారదర్శకంగా పనిచేస్తున్నామని, తమ వద్ద సుమారు 82-85 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రజలు గంటసేపు ఆకలితో ఉండగలరని, కానీ గంటసేపు విద్యుత్తు లేకుండా ఉండలేరని ఆయన అన్నారు.
ఒవైసీ అర్థం చేసుకోవాలి..
భారతదేశంలో ఈద్ పండుగ జరుపుకోవడానికి స్వేచ్ఛ లేదు. ఒవైసీ ఆరోపణలపై స్పందిస్తూ కిషన్ రెడ్డి ఇలా అన్నారు, “ఇది పూర్తిగా తప్పు. స్వేచ్ఛ లేని పాకిస్తానా ఇది? భారతదేశంలో మనకున్నంత స్వేచ్ఛ మరెక్కడా లేదు. ఇక్కడ ప్రతిఒక్కరూ స్వేచ్ఛగా ఉన్నారు. ఏ మతంతోనూ సమస్య లేదు.. ఒవైసీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదు.” అని కిషన్ రెడ్డి అన్నారు.
రాహుల్ గాంధీ గురించి ఏమన్నారంటే..
తాను దేశద్రోహిని కానని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని రాహుల్ గాంధీ అన్నారు. దాడులు జరిగినప్పుడు తాను పాకిస్థాన్కు వ్యతిరేకంగా మాట్లాడలేదని జి. కిషన్ రెడ్డి బదులిచ్చారు. ఆయన సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఒక్క ప్రభుత్వ సంస్కరణకు వ్యతిరేకంగా కూడా ఆయన మాట్లాడలేదు. ఆయన కోవిడ్-19 వ్యాక్సిన్ను వ్యతిరేకించారు. ఆయన జీఎస్టీని వ్యతిరేకించారు. అమెరికా కూడా భారతదేశం నుంచి వ్యాక్సిన్లు పొందింది.. కానీ రాహుల్ గాంధీ దానిని వ్యతిరేకించారు. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు కూడా ఆయన నిరసన తెలిపారు.. అంటూ వివరించారు.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విషయంపై జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బెంగాల్లో మళ్లీ అదే ప్రభుత్వం రాదని అన్నారు. ప్రజలు విసిగిపోయారు. హత్యలు బహిరంగంగా జరుగుతున్నాయి. బెంగాల్ ప్రతి రంగంలోనూ వెనుకబడి ఉంది.. అక్కడి ప్రజలు డబుల్-ఇంజిన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తోంది. తమిళనాడులో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అక్కడ ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారుతుంది. డీఎంకే ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. బంధుప్రీతి ఉంది. అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తోంది. కేరళలో మా స్థానాన్ని మెరుగుపరుచుకుంటాం. పుదుచ్చేరి, అస్సాంలో కూడా మా ప్రభుత్వమే తిరిగి వస్తోందని.. కిషన్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.
