మంత్రిగారి పెద్ద మనసు……..1000 మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు
కర్నాటకలో రెవెన్యూ మంత్రి ఆర్. అశోక్ తన పెద్దమనసును చాటుకున్నారు. వెయ్యి మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు జరిపారు. వీరి బంధువులు లేదా సంబంధీకులు ఎవరైనా వస్తారేమోనని సుమారు రెండు నెలలుగా ఆయన వేచి చూశారు. కానీ

కర్నాటకలో రెవెన్యూ మంత్రి ఆర్. అశోక్ తన పెద్దమనసును చాటుకున్నారు. వెయ్యి మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు జరిపారు. వీరి బంధువులు లేదా సంబంధీకులు ఎవరైనా వస్తారేమోనని సుమారు రెండు నెలలుగా ఆయన వేచి చూశారు. కానీ ఎవరూ రాకపోయేసరికి తానే ఇందుకు పూనుకొన్నారు. కనీసం అస్థికలు సేకరించేందుకు కూడా వారు రాకపోవడం అయనను తీవ్రంగా బాధించింది. ఇక తనే శ్రీరంగపట్నం లోని త్రివేణీ సంగమంలో అస్థికల నిమజ్జనం చేశారు. ప్రధాన పురోహితుడు భాను ప్రకాష్ ఆధ్వర్యంలో డజనుమందికి పైగా పురోహితుల సేవలను అందుకుంటూ నిన్న స్వయంగా ‘సంకల్పం’ చేశారు. మృతుల ఆత్మలకు ఇప్పటికైనా శాంతి కలుగుతుందని ఆశిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. కనీసం దహనవాటికల వద్దకు కూడా వీరి బంధువులు రాలేదని, ఫోన్ చేస్తే చాలామంది ఫోన్లు స్విచాఫ్ అయి ఉన్నాయని, కొందరు అసలు రిసీవ్ చేసుకోలేదని అశోక్ తెలిపారు. అన్ని జిల్లాల్లో అస్థికల కోసం ఎవరూ రాని పక్షంలో ఆ విషయాన్నీ చూడవలసిందిగా తను ఆయా డిప్యూటీ కమిషనర్లందరికీ లేఖలు రాశానన్నారు. హిందూ మతాచారం ప్రకారం అస్థికల నిమజ్జనం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియ జరపడానికి శ్రీరంగపట్నం పవిత్రమైనదని అన్నారు. బెంగుళూరు లోని 11 దహనవాటికల నుంచి ఈ అస్థికలను సేకరించినట్టు ఆయన చెప్పారు.
అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించినట్టు అశోక్ వెల్లడించారు. ఇంకా దాదాపు 1500 అస్థికలు సేకరించడానికి ఎవరూ ముందుకు రాలేదని ఆయన చెప్పారు.
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : చూస్తుండగానే కుప్పకూలిన హైవే రోడ్డు..కొత్త రోడ్డు ఇలా జరిగితే ఎలా అని నెటిజన్లు కామెంట్స్ : Viral Video.
కలర్ ఫుల్ లెమర్స్ బలే డాన్స్ చేస్తున్నాయ్.యూరప్ లోని చెస్టర్ జూ లో అరుదైన లెమర్స్ : Viral Video