Jyothiradhitya Scindia: డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..

ఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటూ టెలికాం కమ్యూనికేషన్ విభాగానికి చెందిన ముఖ్యకార్యదర్శులు, పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరు అయ్యారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ థీమ్ ను లాంచ్ చేశారు కేంద్ర మంత్రి సింధియా. ఆ తరువాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

Jyothiradhitya Scindia: డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
Jyothiradhitya Scindia
Follow us

|

Updated on: Jul 18, 2024 | 11:57 PM

ఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటూ టెలికాం కమ్యూనికేషన్ విభాగానికి చెందిన ముఖ్యకార్యదర్శులు, పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరు అయ్యారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ థీమ్ ను లాంచ్ చేశారు కేంద్ర మంత్రి సింధియా. ఆ తరువాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని విజన్ ఉన్న నాయకుడు అని కొనియాడారు. తాను దగ్గరి నుంచి చూశానన్నారు. అందుకే ఈ విషయాన్ని చెబుతున్నానని పేర్కొన్నారు. ఈ వినూత్న కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. నేడు సాంకేతికతను యువత చాలా బాగా అందిపుచ్చుకుంటోందన్నారు. మన దేశంలో సాంకేతికత అనేక రంగాల్లో విస్తరించిందన్నారు.

కమ్యూనికేషన్, టెక్నాలజీ రంగాలు యువతకు అనేక రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని తెలిపారు. కమ్యూనికేషన్, నెట్వర్ సంబంధించిన విద్యకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. రానున్న రోజుల్లో టెలీకమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయన్నారు. సరికొత్త సంస్కరణలు కూడా తీసుకురానున్నట్లు వివరించారు. రానున్న రోజుల్లో భారత్ డిజిటల్ వేదికగా మారనుందన్నారు. గడిచిన దశాబ్ధకాలంగా ఈ అభివృద్దికి సంబంధించిన అడుగులు పడ్డాయని చెప్పారు. డిజిటల్ ఇండియా మిషన్ లో భాగంగా అభివృద్ది చెందిన దేశాలతో పోటీ పడి భారత్ రానున్న రోజుల్లో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. వాటికి సంబంధించిన కొత్త పాలసీలను తీసుకొస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో 5జీ సేవలు విరివిగా లభిస్తాయన్నారు. ఇండియా ఇతర దేశాలకు 5జీ నెట్వర్క్ ను ఎగుమతి చేసేలా విస్తరిస్తుందన్నారు. టెలీకమ్యూనికేషన్ ను ఒక స్థిరమైనదిగా రూపొందించేందకు ఈ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..