AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: భారత్‌లోకి చొరబాటుకు యత్నం.. ఏడుగురు ఉగ్రవాదుల హతం!

భారత్‌-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పెద్ద ఉగ్రవాద చొరబాటు యత్నాన్ని బీఎస్‌ఎఫ్‌ బలగాలు భగ్నం చేశాయి. శుక్రవారం తెల్లవారుజామున భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను బీఎస్ఎఫ్ బలగాలు హతమార్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఏడుగురు ఉగ్రవాదులకు జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం)తో సంబంధం ఉన్నట్లు భద్రతా బలగాలు అనుమానిన్నాయి.

Jammu Kashmir: భారత్‌లోకి చొరబాటుకు యత్నం.. ఏడుగురు ఉగ్రవాదుల హతం!
Jammu Kashmir
Anand T
|

Updated on: May 09, 2025 | 2:05 PM

Share

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్​ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌-పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఆపరేషన్ తర్వాత పాక్ కూడా ప్రతీకార చర్యలను స్టార్ట్ చేసింది. భారత్‌-పాక్‌ సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ పంపిన 50కి పైగా డ్రోన్లను భారత సైన్యం కూల్చి వేసింది. అయితే ఈ తరుణంలో శుక్రవారం తెల్లవారుజామున కొందరు పాక్‌ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఏగుడురు ఉగ్రవాదులను బీఎస్‌ఎఫ్ బలగాలు కాల్చి చంపినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఏడుగురు ఉగ్రవాదులకు జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) తో సంబంధం ఉన్నట్లు భద్రతా బలగాలు అనుమానిన్నాయి.

మే 8న రాత్రి 11 గంటల ప్రాంతంలో సాంబా సరిహద్దు సమీపంలో అనుమానాస్పద కదలికలను గుర్తించిన బీఎస్ఎఫ్‌ దళాలు ఈ చర్యను ప్రారంభిచినట్టు సమాచారం. ఇక శుక్రవారం తెల్లవారుజామున జమ్మూకాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉగ్రవాదలు చొరబాటు ప్రయత్నాన్ని  భగ్నం చేసి.. ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చినట్టు BSF తన ఎక్స్‌ “X” ఖాతా ద్వారా వెల్లడించింది.

భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. గురువారం జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లోని భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుకొని పాకిస్తాన్ చేసిన దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. పాకిస్తాన్‌ నుంచి భారత్‌లోకి దూసుకొచ్చిన సుమారు 50పైగా డ్రోన్లను భారత సైన్యం ధ్వంసం చేసింది.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లొని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడుడు జరిపింది. ఈ దాడిలో సుమారు 100 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయారు. ఈ దాడి జరిగిన రెండ్రోజుల తర్వాత.. ఈ ఉగ్రవాద చొరబాటు చర్య జరిగినట్టు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..