ISRO Spy case: నంబి నారాయణన్‌కు బిగ్ రిలీఫ్.. కేసు కొట్టేసిన కేరళ హైకోర్టు..

నంబి నారాయణన్‌కు పెద్ద ఉపశమనం లభించింది. భూ ఒప్పందం సీబీఐ విచారణను ప్రభావితం చేస్తుందని దావా వేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టివేసింది.

ISRO Spy case: నంబి నారాయణన్‌కు బిగ్ రిలీఫ్.. కేసు కొట్టేసిన కేరళ హైకోర్టు..
Nambi Narayanan
Follow us

|

Updated on: Nov 15, 2021 | 4:03 PM

ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కు పెద్ద ఉపశమనం లభించింది. భూ ఒప్పందం సీబీఐ విచారణను ప్రభావితం చేస్తుందని దావా వేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. 1994 గూఢచర్యం కేసులో నంబి నారాయణన్‌ను తప్పుగా ఇరికించిన మాజీ పోలీసు అధికారి పిటిషన్‌ను కేరళ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. తనపై నమోదైన కేసులో సీబీఐ దర్యాప్తును నంబి నారాయణన్ ప్రభావితం చేశారని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. నంబి నారాయణన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి చెందిన అప్పటి దర్యాప్తు అధికారులతో కోట్లాది రూపాయల విలువైన భూ ఒప్పందాలు చేయడం ద్వారా ఏజెన్సీ దర్యాప్తును ప్రభావితం చేశారని కేరళ మాజీ పోలీసు అధికారి ఎస్ విజయన్ ఆరోపించారు.

జస్టిస్ ఆర్ నారాయణ్ పిషార్డి ఎస్ విజయన్ పిటిషన్‌ను తోసిపుచ్చారు. వివరణాత్మక ఆర్డర్ కోసం వేచి ఉంది. 1994లో నంబి నారాయణన్‌తో పాటు మరికొందరిని తప్పుగా ఇరికించారనే ఆరోపణలపై విజయన్‌తో పాటు మరో 17 మంది కేరళ మాజీ పోలీసులు, ఐబీ అధికారులపై సీబీఐ దర్యాప్తు చేసింది. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో అనేక ఎకరాల భూమికి సంబంధించిన ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్లను తాను ట్రయల్ కోర్టు ముందు ఉంచానని.. ఇందులో నంబి నారాయణన్ , ఆయన కొడుకు పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్‌లుగా చూపించారని విజయన్ హైకోర్టు ముందు వాదించారు.

ఈ భూములను సీబీఐ అధికారులకు విక్రయించారని ఆరోపించిన ఆయన.. శాస్త్రవేత్త, ఏజెన్సీ అధికారులపై అవినీతి నిరోధక చట్టం కింద ట్రయల్ కోర్టు విచారణకు ఆదేశించేందుకు ఈ మెటీరియల్ సరిపోతుందని వాదించారు. అయితే ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌లో భూమి అమ్మకానికి సంబంధించిన ఆధారాలు లేవని.. అసలు సేల్‌ డీడ్‌ చూపించాలని విజయన్‌ను హైకోర్టు కోరింది. విచారణకు ఆదేశించాలంటే ట్రయల్ కోర్టు అనుమతి కూడా అవసరమని హైకోర్టు పేర్కొంది.

2019లో పద్మభూషణ్..

2018లో సుప్రీంకోర్టు నంబి నారాయణన్‌కు సుమారు $70,000 పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. అలాగే కేరళ ప్రభుత్వం ఈ జరిమానాను ఎనిమిది వారాల్లోగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పాటు కేరళ ప్రభుత్వం అతనికి రూ.1.3 కోట్లు పరిహారంగా ఇవ్వాలని నిర్ణయించింది. 2019 సంవత్సరంలో నంబి నారాయణన్‌కు దేశంలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ లభించింది.

ఇవి కూడా చదవండి: AP Municipal Elections: కుప్పంలో ఏం జరిగిందంటే.. వీడియోలను విడుదల చేసిన సజ్జల రామకృష్ణా రెడ్డి

Malaika Arora: హీరోయిన్ చెంపలు పట్టుకుని లాగిన బాలుడు.. షాక్‏లో మలైకా.. చివరకు ఏం చేసిందంటే..