ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత్ పర్యటన రద్దు

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన భారత పర్యటనను రద్దుచేసుకున్నారు. ఆయన తన పర్యటనను రద్దు చేసుకోవడం ఇది రోండోసారి. నెతన్యాహు ఈ నెల 9న భారత్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే ఈ నెల 17న ఆ దేశంలో ఎన్నికలు జరుగుతున్నందున తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఏప్రిల్‌లో కూడా ఆయన పర్యటన ఉన్నప్పటికీ అప్పుడు కూడా వాయిదా పడింది. అదే నెలలో ఎన్నికలు జరిగియి. దాంట్లో ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇప్పుడు మరోసారి ఎన్నికలు […]

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత్ పర్యటన రద్దు
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2019 | 3:14 AM

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన భారత పర్యటనను రద్దుచేసుకున్నారు. ఆయన తన పర్యటనను రద్దు చేసుకోవడం ఇది రోండోసారి. నెతన్యాహు ఈ నెల 9న భారత్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే ఈ నెల 17న ఆ దేశంలో ఎన్నికలు జరుగుతున్నందున తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఏప్రిల్‌లో కూడా ఆయన పర్యటన ఉన్నప్పటికీ అప్పుడు కూడా వాయిదా పడింది. అదే నెలలో ఎన్నికలు జరిగియి. దాంట్లో ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇప్పుడు మరోసారి ఎన్నికలు జరుపుతున్నారు. మొత్తానికి బెంజమిన్ నెతన్యాహు భారత్ పర్యటన రెండుసార్లు వాయిదా పడటం ఇదే తొలిసారి.

గత ఏడాది జనవరి 14న బెంజమిన్ నెతన్యాహు ఆరు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చారు. ఆ సమయంలో ప్రధాని మోదీ ఆయనకు ప్రొటోకాల్‌ను సైతం పక్కనపెట్టి ఆయనకు స్వాగతం పలికారు. ఆ పర్యటనలో భాగంగా సెంట్రల్ ఢిల్లీలోని తీన్ మూర్తి చైక్ మెమోరియల్‌ పేరును అధికారికంగా తీన్ మూర్తి -హైఫా చౌక్‌గా మార్చారు. ఇజ్రాయెల్ నగరం హైఫా విముక్తి కోసం మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికులకు గుర్తుగా ఈ పేరును మార్చారు. 15 ఏళ్ల తర్వాత భారత్‌లో ఇజ్రాయెల్ ప్రధాని పర్యటించారు. 2003లో అప్పటి ప్రధాని ఏరియల్ షరోన్ పర్యటించారు.