అల‌ర్ట్ : క‌రోనా రోగుల్లో బ‌య‌ట‌ప‌డ్డ మ‌రో ప్రాణాంత‌క ఇన్ఫెక్ష‌న్‌.. సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన వైద్య నిపుణులు

కరోనా మహమ్మారి చేస్తున్ననష్టం అంతా ఇంతా కాదు. కోవిడ్ సోకిన రోగుల్లో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. కోవిడ్ సోకిన వారిలో మళ్లీ కోలుకున్న తర్వాత కొన్ని రోజుల్లోనే ఇన్ఫెక్ష‌న్ సోక‌డం....

అల‌ర్ట్ : క‌రోనా రోగుల్లో బ‌య‌ట‌ప‌డ్డ మ‌రో ప్రాణాంత‌క ఇన్ఫెక్ష‌న్‌.. సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన వైద్య నిపుణులు
ganga ram hospital
Follow us

|

Updated on: Dec 15, 2020 | 11:55 AM

కరోనా మహమ్మారి చేస్తున్ననష్టం అంతా ఇంతా కాదు. కోవిడ్ సోకిన రోగుల్లో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. కోవిడ్ సోకిన వారిలో మళ్లీ కోలుకున్న తర్వాత కొన్ని రోజుల్లోనే ఇన్ఫెక్ష‌న్ సోక‌డం, ద‌వ‌డ‌లు వంక‌ర పోవ‌డం, ముఖ్యంగా కంటి చూపు మంద‌గించ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో మ‌ళ్లీ ఆస్ప‌త్రుల్లో చేర‌క త‌ప్ప‌డం లేదు. క‌రోనా సోకిన త‌ర్వాత కంటి చూపు మంద‌గించ‌డంతో తిరిగి ఆస్ప‌త్రుల్లో చేరుతున్నారు. తాజాగా ఢిల్లీలోని గంగారామ్ ఆస్ప‌త్రి వైద్యులు ప‌లు సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించారు. క‌రోన సోకిన వారికి ఇన్‌ఫెక్ష‌న్ సోక‌డం, కంటి చూపు మంద‌గించ‌డం లాంటివి గుర్తించిన‌ట్లు ఆస్ప‌త్రి వైద్యులు తెలిపారు.

కోవిడ్ రోగుల్లో రోగ‌నిరోధ‌క శ‌క్తి కోల్పోయి ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్ బారిన ప‌డుతున్న‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. ఢిల్లీలోని గంగారామ్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న రోగుల్లో గ‌త 15 రోజుల్లో 12 మందికి తీవ్ర ప్రాణాంత‌క‌మైన ఇన్‌ఫెక్ష‌న్ సోకిన‌ట్లు గుర్తించారు. మూత్ర‌పిండాల వ్యాధి, మ‌ధుమేహం ఉన్న‌వారిలో కోవిడ్ మ‌రింత ప్ర‌భావం చూపుతుంద‌న్నారు. అలాంటి వారిలో రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డ‌మే కాకుండా కంటి చూపు కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని త‌మ ప‌రిశీలన‌లో తేలిన‌ట్లు ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

కాగా, ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల వ్యాపార‌వేత్త‌కు న‌వంబ‌ర్ 20న కోవిడ్ ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయింది. అత‌నికి జ్వ‌రం తీవ్ర‌మై ద‌గ్గు, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది మొద‌లైంది. అత‌న్ని ఆస్ప‌త్రిలో చేర్పించారు. అత‌నికి ఇత‌ర మందులు, ఆక్సిజ‌న్ అంద‌జేశారు. ఏడు రోజుల త‌ర్వాత డిశ్చార్జ్ చేశారు. ఈ నేప‌థ్యంలో అత‌నికి ఎండ‌మ ద‌వ‌డ‌, క‌న్ను, ఎముక‌లు, కండ‌రాలు, మెదుడుపై తీవ్ర ప్ర‌భావం చూపింది. తీరా అత‌నికి యాంటీవైర‌స్ మందులు, క్రిటిక‌ల్ కేర్ సపోర్టు ఇచ్చారు. దీంతో ఆయ‌న నెమ్మ‌దిగా కోలుకున్నారు. ఇలా కోవిడ్ సోకిన చాలామంది ఇన్‌ఫెక్ష‌న్‌కు గుర‌వుతున్న‌ట్లు ఆస్ప‌త్రి వైద్యులు తెలిపారు. వీలైనంత త్వ‌ర‌గా యాంటీ ఫంగ‌స్ థెర‌పీని ప్రారంభించాల‌ని సూచిస్తున్నారు.

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.