AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raja Raghuvanshi murder: టూరిస్ట్ కెమెరాలో రికార్డ్ అయిన రఘువంశీ భర్తకంటే ముందు నడుస్తున్న సోనమ్..

దేశంలో అత్యంత చర్చనీయాంశమైన రాజా రఘువంశీ హత్య కేసుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియో రాజు హత్యకు ముందు రికార్డ్ అయింది. ఇద్దరూ అనుకోకుండా ఒక పర్యాటకుడి కెమెరాలో ఈ వీడియో రికార్డ్ అయింది. ఇందులో సోనమ్ తెల్లటి టీ-షర్ట్ ధరించి ముందుకు నడుస్తూ కనిపించింది. కాగా రాజా రఘువంశీ ఆమె వెనుక నడుస్తూ కనిపించాడు.

Raja Raghuvanshi murder: టూరిస్ట్ కెమెరాలో రికార్డ్ అయిన రఘువంశీ భర్తకంటే ముందు నడుస్తున్న సోనమ్..
Indore Video
Surya Kala
|

Updated on: Jun 16, 2025 | 10:01 AM

Share

ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య జరిగి 24 రోజులు గడిచాయి. రాజా హత్య కేసులో అతని భార్యతో సహా ఐదుగురు నిందితులు ప్రస్తుతం పోలీసు రిమాండ్‌లో ఉన్నారు. వారు తమ నేరాన్ని అంగీకరించారు. ఇంతలో రాజా రఘువంశీ హత్యకు ముందు ఉన్న వీడియో వైరల్ అయింది. దీనిలో భార్యాభర్తలిద్దరూ పర్యాటకుల కెమెరాలో ట్రెక్కింగ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. రాజా, సోనమ్ ఇద్దరూ ట్రెక్కింగ్‌కు వెళ్తున్నారు. అదే సమయంలో.. ఒక పర్యాటకుడు వీడియోను తీస్తున్నాడు. రాజా, సోనమ్ కూడా అతని కెమెరాకు చిక్కుకున్నారు.

ఆ వీడియోలో సోనమ్ ముందుకు నడుస్తూ కనిపించగా రాజా ఆమె వెనుక ఉన్నాడు. సోనమ్ తెల్లటి టీ-షర్ట్ ధరించింది. రాజా తెల్లటి స్లీవ్‌లెస్ టీ-షర్ట్ ధరించాడు. వాస్తవానికి షిల్లాంగ్‌ను సందర్శించడానికి వెళ్ళిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో డబుల్ డెక్కర్ బ్రిడ్జికి వెళ్లేటప్పుడు వీడియో తీస్తున్నప్పుడు.. సోనమ్, రఘువంశీ కూడా తన ఫ్రేమ్‌లో బంధించబడ్డారని పేర్కొన్నాడు. ఇద్దరూ పైకి వెళ్తున్నారు. రాజా రఘువంశీ మృతదేహం దగ్గర.. దొరికిన తెల్లటి చొక్కాను తన వీడియోలో ఉన్న సోనమ్ ధరించిందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

దేవ్ సింగ్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేసి ఇలా వ్రాశాడు. నేను 23 మే 2025న మేఘాలయ డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జికి ట్రిప్‌కి వెళ్లి వీడియోను రికార్డ్ చేసాను. నిన్న నేను వీడియో చూస్తున్నప్పుడు ఇండోర్ నుంచి వచ్చిన ఆ జంట తన వీడియోలో రికార్డ్ అయినట్లు తెలిసింది. మేము కిందకు దిగుతున్నప్పుడు ఉదయం 9:45 గంటల ప్రాంతంలో రాజా-సోనమ్ నోగ్రిట్ గ్రామంలో రాత్రి గడిపిన తర్వాత పైకి వెళ్తున్నారు. వీడియోను షేర్ చేసిన వ్యక్తి ఇంకా ఇలా వ్రాశాడు. ఇది ఈ ఇద్దరు కలిసి ఉన్న చివరి రికార్డింగ్ అని నేను అనుకుంటున్నాను. రాజాతో దొరికిన అదే తెల్లటి చొక్కాను సోనమ్ ధరించింది. కేసును పరిష్కరించడంలో మేఘాలయ పోలీసులకు కూడా ఇది సహాయపడుతుందని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

View this post on Instagram

A post shared by Dev (@m_devsingh)

‘రాజు మామూలుగా కనిపించాడు’

వీడియోలో రాజా రఘువంశీని చూస్తూ దేవ్ సింగ్ ఇలా వ్రాశాడు.. నేను వీడియోలో రాజాను చూసినప్పుడల్లా.. అతని పట్ల తనకు చాలా బాధగా అనిపించింది. అతను సాధారణంగా కనిపించాడు. అయితే అతని కోసం ఏమి వేచి ఉందో అతనికి తెలియదని చెప్పాడు. తన దగ్గర ఉన్న వీడియోలో ఇండోర్ నుంచి వచ్చిన మరో 3 మంది వ్యక్తులు కూడా కనిపించారు. వారు ఈ ఇద్దరి కంటే 20 నిమిషాల ముందు ప్రయాణాన్ని ప్రారంభించి పోలీసుల చేతిలో పట్టుబడ్డారని పేర్కొన్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..