AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 Summit: ‘వసుధైక కుటుంబం’ అనే గొప్ప సందేశాన్ని చాటిన యోగా దినోత్సవం..

ఈ ఏడాది భారత్‌ జీ20 సమ్మిట్‌ను నిర్వహిస్తున్నవ విషయం తెలిసిందే. వసుధైక కుటుంబం (విశ్వమంతా ఒకే కుటుంబం) అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది భారత్‌. ఈ ట్యాగ్ లైన్‌ ద్వారా భారత్‌ యావత్ ప్రపంచానికి ఏకతా సందేశాన్ని పంపుతోంది. అయితే ఇది కేవలం ట్యాగ్‌ లైన్‌కు మాత్రమే పరిమితం కాకుండా అంతర్జాతీయ యోగా దినోత్సవంతో సహా వివిధ కార్యక్రమాల ద్వారా భారతదేశం 'ఒక కుటుంబం' సందేశాన్ని ఇచ్చింది...

G20 Summit: 'వసుధైక కుటుంబం' అనే గొప్ప సందేశాన్ని చాటిన యోగా దినోత్సవం..
Pm Modi
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 11, 2023 | 3:54 PM

ఈ ఏడాది భారత్‌ జీ20 సమ్మిట్‌ను నిర్వహిస్తున్నవ విషయం తెలిసిందే. వసుధైక కుటుంబం (విశ్వమంతా ఒకే కుటుంబం) అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది భారత్‌. ఈ ట్యాగ్ లైన్‌ ద్వారా భారత్‌ యావత్ ప్రపంచానికి ఏకతా సందేశాన్ని పంపుతోంది. అయితే ఇది కేవలం ట్యాగ్‌ లైన్‌కు మాత్రమే పరిమితం కాకుండా అంతర్జాతీయ యోగా దినోత్సవంతో సహా వివిధ కార్యక్రమాల ద్వారా భారతదేశం ‘ఒక కుటుంబం’ సందేశాన్ని ఇచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జీ20 సదస్సు జరగనున్న విషయం విధితమే. ఇందుకోసం జనవరి నుంచే సన్నాహాలు మొదలుపెట్టారు. అన్ని జి-20 దేశాల ప్రతినిధులతో భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో విడివిడిగా సమావేశాలు జరుగుతున్నాయి అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతి సమావేశం ద్వారా ఐక్యతా సందేశాన్ని చాటుతోంది.

ఈ ఏడాది 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి భారతదేశం అధ్యక్షత వహించింది. ఐక్యరాజ్యసమితి నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అధ్యక్షత వహించారు. 135 కంటే ఎక్కువ దేశాల నుంచి లక్షల్లో ప్రజలు ఈ ఈవెంట్‌లో పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఏకతా సందేశాన్ని కూడా ఇచ్చారు. పర్యాటక రంగాన్ని విస్తరించేందుకు భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఇప్పటికే G20 దేశాల ప్రతినిధులతో పలు సమావేశాలు నిర్వహించింది.

ఇవి కూడా చదవండి

ఆ సమావేశాలలో, దేశ సంస్కృతిని ప్రపంచ స్థాయికి తీసుకురావడం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలతో పాటు భారతదేశాని సొంతమైన ‘భిన్నత్వంలో ఏకత్వం’ సందేశాన్ని చాటి చెప్పింది. ఇదిలా ఉంటే జీ20 మూడో సమావేశంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ భాగస్వామ్యంపై చర్చ జరిగింది. అంతే కాకుండా పురుషులతో సమానంగా మహిళలు పోటీపడుతున్నారనే విషయాన్ని ‘ఉమెన్-20 సమ్మిట్’ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రస్తుత ‘గ్లోబల్ వార్మింగ్’ను అరికట్టాలంటే పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటడంపై దృష్టి సారించడం చాలా అవసరమని, ఈ విషయంలో అన్ని దేశాలు సంయుక్తంగా ముందుకు రావాలని జీ-20 సమావేశంలో సూచించారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున చెట్లను నాటడం ద్వారా ప్రపంచాన్ని రక్షించాలనే సందేశాన్ని సమర్థిస్తున్నందున, G-20 సమావేశంలో నీటి సంరక్షణ థీమ్ కూడా ప్రముఖంగా ఉంది. వ్యవసాయ రంగ అభివృద్ధికి హైదరాబాద్‌లో మరోసారి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మిల్లెట్ ఆర్థిక సంవత్సరంగా మిల్లెట్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. అందరికీ ఆహారం, ఆరోగ్య సేవల అంశాన్ని ప్రస్తావించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్‌కు ఝలక్..
పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్‌కు ఝలక్..
13 ఏళ్లకే టాలీవుడ్ లవర్ బాయ్.. తెలుగు హీరో హరీష్ గుర్తున్నాడా.. ?
13 ఏళ్లకే టాలీవుడ్ లవర్ బాయ్.. తెలుగు హీరో హరీష్ గుర్తున్నాడా.. ?
ఈ 5 రోహిత్ రికార్డులు బ్రేక్ చేయాలంటే, మరో జన్మ ఎత్తాల్సిందే
ఈ 5 రోహిత్ రికార్డులు బ్రేక్ చేయాలంటే, మరో జన్మ ఎత్తాల్సిందే
రాక్ సాల్ట్ వాడటం ఆరోగ్యానికి మంచిదేనా..?
రాక్ సాల్ట్ వాడటం ఆరోగ్యానికి మంచిదేనా..?
ఇవి తింటే కడుపులో ఉన్న చెత్తంతా బయటికి పోతుంది..!
ఇవి తింటే కడుపులో ఉన్న చెత్తంతా బయటికి పోతుంది..!
సింహాచలం ఘటన దురదృష్టకరం.. పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌ దిగ్ర్బాంతి..
సింహాచలం ఘటన దురదృష్టకరం.. పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌ దిగ్ర్బాంతి..
వ్యాక్సిన్ ఏ చేతికి వేసుకుంటే ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది.. ?
వ్యాక్సిన్ ఏ చేతికి వేసుకుంటే ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది.. ?
తెలంగాణ 10th విద్యార్ధులకు 2025 అలర్ట్.. కాస్త ఆలస్యంగా ఫలితాలు!
తెలంగాణ 10th విద్యార్ధులకు 2025 అలర్ట్.. కాస్త ఆలస్యంగా ఫలితాలు!
వైభవ్‌కు ఊహించని షాకిచ్చిన ఐసీసీ.. వచ్చే ఏడాది వరకు నిషేధం?
వైభవ్‌కు ఊహించని షాకిచ్చిన ఐసీసీ.. వచ్చే ఏడాది వరకు నిషేధం?
Kudavelli: కూడవెల్లి రామలింగేశ్వర ఆలయం.. రామాయణంతో లింక్.. ఏంటది.
Kudavelli: కూడవెల్లి రామలింగేశ్వర ఆలయం.. రామాయణంతో లింక్.. ఏంటది.