AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudha Murty: రాజ్యసభకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా మూర్తి నామినేట్

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా మూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి కోటాలో ఆమె పెద్ద సభలో అడుగు పెట్టబోతున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా ఆమెకు అభినందనలు తెలిపారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో సహా విభిన్న రంగాలకు సుధా మూర్తి చేసిన కృషి అపారమైనదని ప్రధాని మోదీ కొనియాడారు.

Sudha Murty: రాజ్యసభకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా మూర్తి నామినేట్
Sudha Murthy
Balaraju Goud
|

Updated on: Mar 08, 2024 | 1:20 PM

Share

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా మూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి కోటాలో ఆమె పెద్ద సభలో అడుగు పెట్టబోతున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా ఆమెకు అభినందనలు తెలిపారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో సహా విభిన్న రంగాలకు సుధా మూర్తి చేసిన కృషి అపారమైనదని ప్రధాని మోదీ కొనియాడారు. స్ఫూర్తిదాయకమైన ఆమె రాజ్యసభలో ఉండటం మన ‘నారీ శక్తి’కి ఒక శక్తివంతమైన నిదర్శనమన్నారు. మన దేశం విధిని రూపొందించడంలో మహిళల శక్తి, సామర్థ్యాన్ని ఉదాహరణగా చూపుతుందన్నారు. ఆమెకు ఫలవంతమైన పార్లమెంటు పదవీకాలం కావాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ.

ఒక ఉపాధ్యాయురాలుగా ప్రస్థానం ప్రారంభించిన సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ఆమె భర్త ఎన్ఆర్ నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు. సుధా మూర్తి రచయిత, దాతృత్వాన్ని నమ్ముతారు. 2006లో ఆమె చేసిన సామాజిక సేవకు గానూ ప్రభుత్వం భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. 2023లో ఆమెకు భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ కూడా లభించింది.

సుధా మూర్తి 19 ఆగస్టు 1951న కర్ణాటకలోని షిగ్గావ్‌లో జన్మించారు. ఆమె కన్నడ మాట్లాడే దేశస్థ మాధవ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. సుధా మూర్తి BVB కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో B.Eng పూర్తి చేశారు. తర్వాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి కంప్యూటర్ సైన్స్‌లో ఎం.ఇంగ్ డిగ్రీని పొందారు.

తన చదువు పూర్తయిన తర్వాత, సుధా మూర్తి భారతదేశంలోని అతిపెద్ద ఆటో తయారీదారు టాటా ఇంజనీరింగ్, లోకోమోటివ్ కంపెనీలో పని చేయడం ప్రారంభించారు. ఆమె ఆ సమయంలో మొదటి మహిళా ఇంజనీర్ కావడం విశేషం. ఆ తర్వాత ఆమె పూణేలో డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా కంపెనీలో చేరారు

1996లో, సుధా మూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ఈ రోజు వరకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీగా, బెంగుళూరు విశ్వవిద్యాలయంలోని PG సెంటర్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆమె క్రైస్ట్ యూనివర్సిటీలో కూడా బోధించారు. సుధా మూర్తి, నారాయణ మూర్తికి ఇద్దరు పిల్లలు, అక్షతా మూర్తి, రోహన్ మూర్తి. అక్షతా మూర్తి బ్రిటిష్ ప్రధాన మంత్రి, రిషి సునక్‌ను వివాహం చేసుకున్నారు.

సుధా మూర్తి నవలలు, నాన్-ఫిక్షన్, ట్రావెలాగ్స్, టెక్నాలజీ ఆధారిత పుస్తకాలు, జ్ఞాపకాలు వంటి అనేక పుస్తకాలను రాశారు. ఆమె రాసిన అన్ని పుస్తకాలను ప్రధాన భారతీయ భాషలలోకి అనువదించారు. అంతకాదు ఇంగ్లీష్, కన్నడ వార్తాపత్రికలకు కాలమిస్ట్ కూడా పనిచేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..