Indian Govt on Twitter: ప్రముఖుల బ్లూ టిక్ తొలగింపుపై కేంద్రం సీరియస్.. సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌కు ఆఖరి వార్నింగ్‌!

భారత్‌లో ట్విటర్‌ను బ్యాన్‌ చేస్తారా ? ట్విటర్‌ ఎందుకు తిరుగుబాటు ధోరణి ప్రదర్శిస్తోంది ? ఈ విషయం ఎవరికి అంతుచిక్కడం లేదు. ఇదేక్రమంలో సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌కు ఆఖరి వార్నింగ్‌ ఇచ్చింది కేంద్రం.

Indian Govt on Twitter: ప్రముఖుల బ్లూ టిక్ తొలగింపుపై కేంద్రం సీరియస్.. సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌కు ఆఖరి వార్నింగ్‌!
Twitter
Follow us

|

Updated on: Jun 05, 2021 | 5:42 PM

Indian Govt expresses displeasure on Twitter: భారత్‌లో ట్విటర్‌ను బ్యాన్‌ చేస్తారా ? ట్విటర్‌ ఎందుకు తిరుగుబాటు ధోరణి ప్రదర్శిస్తోంది ? ఈ విషయం ఎవరికి అంతుచిక్కడం లేదు. తమతో ఢీ అంటే ఢీ అంటున్న సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌కు ఆఖరి వార్నింగ్‌ ఇచ్చింది కేంద్రం. తాజాగా మరోసారి కేంద్రం, ట్విటర్‌ మధ్య వివాదం చెలరేగడమే ఇందుకు కారణం.

కొత్త ఐటీ నిబంధనల ప్రకారం ట్విటర్‌ ఇంకా భారత్‌లో అధికారులను నియమించకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇదే చివరి హెచ్చరికగా పేర్కొంటూ తుది నోటీసులు జారీ చేసింది. తక్షణమే అధికారులను నియమించాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

సోషల్‌మీడియాలో కంటెంట్‌ నియంత్రణ కోసం కేంద్రం కొత్త ఐటీ రూల్స్‌ను తీసుకొచ్చింది. ఈ నిబంధనల అమలు కోసం సోషల్‌మీడియా సంస్థలకు ఇచ్చిన 3నెలల గడువు ముగియడంతో మే 26 నుంచి కొత్త రూల్స్‌ అమల్లోకి వచ్చాయి. అయితే ఈ నిబంధనల కింద చీఫ్‌ కాంప్లియన్స్‌ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉండగా.. ట్విటర్‌ ఇంకా దానిపై నిర్ణయం తీసుకోలేదు. అంతేగాక, రూల్స్‌ ప్రకారం.. రెసిడెంట్ గ్రీవెన్స్‌ ఆఫీస్‌, నోడల్‌ కాంటాక్ట్‌ అధికారులను భారత్‌కు చెందిన వ్యక్తులను నియమించకపోవడంతో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. . కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చి వారం గడిచినా ట్విటర్‌ ఇంకా వీటిని పాటించేందుకు ఒప్పుకోవడం లేదని కేంద్రం మండిపడింది.

దీంతో కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ ఇవాళ ట్విటర్‌కు నోటీసులు జారీ చేసింది. ఇదే చివరి నోటీసు అని, నిబంధనలు తక్షణమే పాటించకపోతో ట్విటర్‌ తన మధ్యవర్తిత్వ హోదాను కోల్పోవాల్సి వస్తుందని కేంద్రం హెచ్చరించింది. అప్పుడు సంస్థ చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌ లాంటి ప్రముఖుల వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాకు వెరిఫైడ్‌ బ్లూ టిక్‌ మార్క్‌ను శనివారం కాసేపు తొలగించి మళ్లీ యాడ్‌ చేయడంపై కూడా వివాదం చెలరేగింది. ఈ పరిణామాలు చోటుచేసుకున్న కొద్ది గంటలకే ట్విటర్‌కు నోటీసులు జారీ కావడం సంచలనం రేపుతోంది.

Vice President, Rss Chief Twitter

Vice President, Rss Chief Twitter

Read Also… MP Dharmapuri Arvind: బ్యాన్ అయిందనకున్న గేమ్ మళ్లీ వస్తుంది.. భాతీయుల డేటాకు ముప్పు.. కేంద్రానికి ఎంపీ అరవింద్ లేఖ!

Latest Articles
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..
స్టైలిష్ డ్రెస్ లో మోడరన్ మేనకలా మెరిసిపోతున్న అమృత అయ్యర్.
స్టైలిష్ డ్రెస్ లో మోడరన్ మేనకలా మెరిసిపోతున్న అమృత అయ్యర్.
ఈవినింగ్ వాకింగ్ చేస్తే.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
ఈవినింగ్ వాకింగ్ చేస్తే.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
అఫీషియల్.. ఆహాలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అఫీషియల్.. ఆహాలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సులువుగా బరువు తగ్గాలంటే ఈ ఒక్క సూపర్ డ్రింక్‌ తాగితే సరి..
సులువుగా బరువు తగ్గాలంటే ఈ ఒక్క సూపర్ డ్రింక్‌ తాగితే సరి..
మీకు తెలుసా.. ఈ దేశాల్లోని ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారట!
మీకు తెలుసా.. ఈ దేశాల్లోని ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారట!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..