AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో..! చెప్పుల వ్యాపారులపై ఐటీశాఖ దాడులు.. మంచం, కుర్చీ, బల్ల.. ఎక్కడ చూసినా రూ.500 నోట్ల కట్టలే..100కోట్లకు పైగానే..

దాదాపు 5 గంటల పాటు సాగిన ఈ సోదాల్లో ఆదాయపు పన్ను శాఖ బృందం షోరూమ్‌లోని ప్రతి మూలను సోదా చేసింది. దీంతో పాటు చెప్పుల వ్యాపారికి చెందిన పలు ప్రాంతాల్లో ఐటీ బృందం తనిఖీలు చేసింది. ఇంత భారీ పన్ను ఎగవేత అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చెప్పుల వ్యాపారులపై జరిగిన ఈ దాడి నగరంలో కలకలం సృష్టించింది.

వామ్మో..! చెప్పుల వ్యాపారులపై ఐటీశాఖ దాడులు.. మంచం, కుర్చీ, బల్ల.. ఎక్కడ చూసినా రూ.500 నోట్ల కట్టలే..100కోట్లకు పైగానే..
Income Tax Raid
Jyothi Gadda
|

Updated on: May 19, 2024 | 6:18 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఆదాయపు పన్ను శాఖ భారీ చర్యలు చేపట్టింది. ఆగ్రా నగరంలోని ముగ్గురు చెప్పుల వ్యాపారుల స్థలాలు, సంస్థలపై అకస్మిక తనిఖీలు చేపట్టింది. ఐటీ శాఖ సోదాల్లో లెక్కకు మిక్కిలి ఆస్తులు లభ్యమయ్యాయి. ఇప్పటి వరకు రూ.40 కోట్ల నగదు దొరికిందని, మిగిలిన నగదును లెక్కిస్తున్నామని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. దాడి సమయంలో షూ వ్యాపారి ఇంట్లో నోట్ల కుప్పలు గుర్తించినట్టుగా తెలిసింది. అందిన సమాచారం మేరకు ఆదాయపు పన్ను శాఖ దాడులు అర్థరాత్రి వరకు కొనసాగాయి. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఆగ్రాలోని ఎంజీరోడ్‌కు చెందిన బీకే షూష్‌, ఢక్రాన్‌కు చెందిన మన్షు ఫుట్‌వేర్‌, ఆసుఫోటిడా మండికి చెందిన హర్మిలాప్‌ ట్రేడర్స్‌పై ఆదాయపు పన్నుశాఖ శనివారం దాడులు జరిపింది. ఐటీ సోదాల్లో నగదుతో పాటు ల్యాప్‌టాప్, మొబైల్, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. భూమి, బంగారంపై పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అల్మారాలు, షూ బాక్స్‌లు, మంచాల్లో కరెన్సీ నోట్ల కట్టలు కనిపించాయి. రాత్రి 2 గంటల సమయంలో నోట్లు లెక్కించే యంత్రాలు వేడెక్కడంతో ఇతర యంత్రాలను రప్పించారు. 100 కోట్లకు పైగా అప్రకటిత ఆదాయాన్ని సరెండర్ చేసే అవకాశం ఉందని ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెల్లడించారు.

చెప్పుల వ్యాపారులు ఆదాయపు పన్ను ఎగవేస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందింది. పక్కా సమాచారం మేరకు అధికారులు దాడులకు దిగారు. స్వాధీనం చేసుకున్న నగదు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బెడ్ మొత్తం రూ.500 నోట్ల వేల కట్టలతో నిండిపోవడం ఫోటోలో కనిపిస్తోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు షూ వ్యాపారుల షోరూమ్‌పై ఆదాయపు పన్ను శాఖ బృందం దాడులు చేసింది. దాదాపు 5 గంటల పాటు సాగిన ఈ సోదాల్లో ఆదాయపు పన్ను శాఖ బృందం షోరూమ్‌లోని ప్రతి మూలను సోదా చేసింది. దీంతో పాటు చెప్పుల వ్యాపారికి చెందిన పలు ప్రాంతాల్లో ఐటీ బృందం తనిఖీలు చేసింది. ఇంత భారీ పన్ను ఎగవేత అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆగ్రాలో చెప్పుల వ్యాపారులపై జరిగిన ఈ దాడి నగరంలో కలకలం సృష్టించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఐటీ శాఖ ఆగ్రా సహా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..