AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi violence : వెల్లివిరిసిన మానవత్వం..సిక్కుల సాహసానికి హ్యాట్సాఫ్

గత కొన్ని రోజులుగా దేశరాజధాని ఢిల్లీలో వరుస అల్లర్లతో అట్టుడికిపోయింది. క్షణక్షణం రగులుతున్న అగ్నిగుండంలా ఢిల్లీ వీధులు రావణ కాష్టాన్ని తలపించాయి. రెచ్చిపోయిన అల్లరి మూకలు..వాహనాలు, ఇళ్లకు నిప్పుపెడుతూ...బీభత్సం సృష్టించారు. అంతటి హింసలోనూ అక్కడ మానవత్వం వెల్లివిరిసింది.

Delhi violence : వెల్లివిరిసిన మానవత్వం..సిక్కుల సాహసానికి హ్యాట్సాఫ్
Jyothi Gadda
|

Updated on: Mar 01, 2020 | 10:58 AM

Share

గత కొన్ని రోజులుగా దేశరాజధాని ఢిల్లీలో వరుస అల్లర్లతో అట్టుడికిపోయింది. క్షణక్షణం రగులుతున్న అగ్నిగుండంలా ఢిల్లీ వీధులు రావణ కాష్టాన్ని తలపించాయి. రెచ్చిపోయిన అల్లరి మూకలు..వాహనాలు, ఇళ్లకు నిప్పుపెడుతూ…బీభత్సం సృష్టించారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 42 మంది చనిపోయినట్లుగా అధికారికంగా వెల్లడించారు. ఇంకా 200 మందికి పైగా క్షతగాత్రులు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. కాగా, అంతటి హింసలోనూ అక్కడ మానవత్వం వెల్లివిరిసింది.

సిక్కు కుటుంబానికి చెందిన తండ్రీ కొడుకులు పదుల సంఖ్యలో ముస్లింల ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే…ఫిబ్రవరి 24…అది ఢిల్లీలోని గోకుల్‌పురి ప్రాంతం.. అక్కడ ఎటు చూసినా ఆందోళనలు, అల్లర్లు, రాళ్లదాడులు, విధ్వంసాలే దర్శనమిచ్చాయి. పిల్లలు, పెద్దలు, మహిళలు అనే తేడా లేకుండా పరిస్థితులకు బలైపోతున్నారు. చుట్టు ముడుతున్న అల్లరి మూకల నుండి తమను తాము రక్షించుకునే ప్రయత్నంలోనూ తొక్కిసలాట జరిగింది. దూసుకొస్తున్న ఆందోళనకారుల పంజా నుంచి రెండు వాహనాలపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుండి సహాయక చర్యలు మొదలు పెట్టారు. కనిపించిన బాధితులను వారి బైక్‌లపై ఎక్కించుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలా ఆ ఇద్దరు వ్యక్తులు చేసిన సహాయంతో మొత్తం 60 నుంచి 70 మంది ముస్లింలు ప్రాణపాయం నుంచి క్షేమంగా బయటపడ్డారు.

అయితే, ఆ తర్వాత తెలిసింది ఏంటంటే…వారిని కాపాడిన ఆ ఇద్దరు వ్యక్తులు సిక్కులు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఢిల్లీలో ఓ మీడియకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సిక్కు తండ్రి వెల్లడించారు. ఆ రోజున ఇక్కడ తాము చూసిన ఘటన 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను గుర్తుచేసుకుని భయపడిపోయామన్నారు.. తాము కాపాడిన వారంతా ముస్లింలేనని, అందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. అయితే, తాము కేవలం మానవతా దృపక్పథంలోనే వారిని కాపాడామని చెప్పారు. సిక్కు తండ్రీ కొడుకుల ఔదార్యానికి ఢిల్లీ వాసులతో పాటుగా, నెటిజన్లను సైతం సెల్యూట్ చేస్తున్నారు.

Follow Us
ఇంట్లో ఉన్న పాత టీవీలోంచి వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్లి చూడగా
ఇంట్లో ఉన్న పాత టీవీలోంచి వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్లి చూడగా
ఏపీలో హీరో మహేష్ బాబు పోలికలతో రాముడి విగ్రహం.. ఫొటోస్ వైరల్
ఏపీలో హీరో మహేష్ బాబు పోలికలతో రాముడి విగ్రహం.. ఫొటోస్ వైరల్
బంగారం ధరలపై పిడుగులాంటి వార్త..
బంగారం ధరలపై పిడుగులాంటి వార్త..
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కి.మీ.. ఎలక్ట్రిక్ స్కూటర్లలో కింగ్..
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కి.మీ.. ఎలక్ట్రిక్ స్కూటర్లలో కింగ్..
జస్ట్ 10 నిమిషాలు చాలు.. ఇంట్లోనే అమృతాన్ని తయారు చేసుకోవచ్చు..
జస్ట్ 10 నిమిషాలు చాలు.. ఇంట్లోనే అమృతాన్ని తయారు చేసుకోవచ్చు..
ప్రపంచంలో పూర్తిగా బ్యాన్ చేసిన ఫుడ్స్ ఇవే.. తిన్నారో డైరెక్ట్
ప్రపంచంలో పూర్తిగా బ్యాన్ చేసిన ఫుడ్స్ ఇవే.. తిన్నారో డైరెక్ట్
భర్తతో విడాకులు.. ప్రియుడితో బ్రేకప్.. డేటింగ్ పై హీరోయిన్ రియాక్
భర్తతో విడాకులు.. ప్రియుడితో బ్రేకప్.. డేటింగ్ పై హీరోయిన్ రియాక్
ఏపీలో మరో 6 లైన్ల నేషనల్ హైవే.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్..
ఏపీలో మరో 6 లైన్ల నేషనల్ హైవే.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్..
మహిళకు ఉబెర్ డ్రైవర్ అసభ్యకరమైన మెసేజ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
మహిళకు ఉబెర్ డ్రైవర్ అసభ్యకరమైన మెసేజ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
బెంగళూరులో వర్షం కురిసే అవకాశం..ఫస్ట్ మ్యాచ్ జరుగుతుందా?
బెంగళూరులో వర్షం కురిసే అవకాశం..ఫస్ట్ మ్యాచ్ జరుగుతుందా?