AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఇది సినిమా కాదండోయ్.. పక్కా నిజం..ఈగలు హత్యకేసు హంతకుడ్ని పట్టించాయ్..

జబల్ పూర్ జిల్లాలోని తప్రియా గ్రామంలో గత నెల 30న ఓ హత్య జరిగింది. పోలీసుల స్పాట్‌కు వచ్చి క్లూస్ సేకరిస్తూ ఉండగా.. అనూహ్య ఘటన జరిగింది. ఆ డీటేల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి..

Viral: ఇది సినిమా కాదండోయ్.. పక్కా నిజం..ఈగలు హత్యకేసు హంతకుడ్ని పట్టించాయ్..
Flies
Ram Naramaneni
|

Updated on: Nov 06, 2024 | 12:23 PM

Share

హత్య చేసి తెలివిగా తప్పించుకోవాలనుకున్నాడు ఓ యువకుడు. అయితే ఈగలు కారణంగా అతను పోలీసులకు అడ్డంగా చిక్కాడు. అదెలా అనుకుంటున్నారా?. ఆ ఇంట్రస్టింగ్ డీటేల్స్ తెలుసుకుందాం పదండి.  మధ్యప్రదేశ్‌ జబల్ పూర్ జిల్లాలోని తప్రియా గ్రామంలో అక్టోబరు 30న ఓ మర్డర్ జరిగింది. పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మనోజ్ ఠాకూర్ అనే యువకుడ్ని చంపేశారు దుండగులు. ఊరు చివరనున్న పంట పొలాల్లో మనోజ్ డెడ్‌బాడీని గ్రామస్థులు గుర్తించారు. గ్రామస్థుల సమాచారంతో హత్య విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. మృతదేహం పడి ఉన్న చోటును, హత్య జరిగిన తీరును పరిశీలిస్తుండగా ఓ అనూహ్య ఘటన జరిగింది. అక్కడ గుమిగూడిన జనంలో ఉన్న యువకుడు ధరమ్ ఠాకూర్ శరీరంపై విపరీతంగా ఈగలు వాలడాన్ని పోలీసులు గమనించారు.

దీంతో అనుమానం వచ్చిన పోలీసులు పక్కకు తీసుకెళ్లి తనిఖీ చేయగా.. ధరమ్ ఠాకూర్ ఛాతీపై రక్తపు మరకలు కనిపించాయి. దాంతో తమదైన శైలిలో విచారించగా.. మనోజ్‌ను తానే హత్య చేసినట్లు ధరమ్ ఒప్పుకున్నాడు. చివరిసారిగా వారిద్దరూ స్థానిక మార్కెట్‌లో కోడి మాంసం, మద్యం కొనుగోలు చేశారని పోలీసుల దర్యాఫ్తులో తెలిసింది. వాటి ఖరీదు విషయంలో జరిగిన గొడవే మనోజ్ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ధరమ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి