గుండెనొప్పితోనే 15 కి.మీ డ్రైవింగ్.. ప్రయాణికులను గమ్యానికి చేర్చి ఆశువులు బాసిన ఆర్టీసీ బస్ డ్రైవర్
ప్రాణాలను మెలిపెట్టే గుండెనొప్పి వేధిస్తోన్నా లెక్క చెయ్యకుండా డ్రైవింగ్ చేశాడు. ప్రయాణికులను చేర్చవలసిన గమ్యానికి సురక్షితంగా చేర్చి ఆశువులు బాసాడో ఆర్టీసీ బస్ డ్రైవర్. ఈ విషాద ఘటన గుజరాత్లోని రాధన్పూర్లో సోమవారం (ఏప్రిల్ 10) చోటుచేసుకుంది. బస్ కండక్టర్ తెలిపిన వివరాల ప్రకారం..
ప్రాణాలను మెలిపెట్టే గుండెనొప్పి వేధిస్తోన్నా లెక్క చెయ్యకుండా డ్రైవింగ్ చేశాడు. ప్రయాణికులను చేర్చవలసిన గమ్యానికి సురక్షితంగా చేర్చి ఆశువులు బాసాడో ఆర్టీసీ బస్ డ్రైవర్. ఈ విషాద ఘటన గుజరాత్లోని రాధన్పూర్లో సోమవారం (ఏప్రిల్ 10) చోటుచేసుకుంది. బస్ కండక్టర్ తెలిపిన వివరాల ప్రకారం..
గుజరాత్లోని రాధన్పూర్కు చెందిన గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (జిఎస్ఆర్టిసి) డ్రైవర్ భర్మల్ అహిర్ (40) ఎప్పటి మాదిరిగానే బస్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇంతలో ఉన్నట్టుండి డ్రైవింగ్ చేస్తుండగానే చాతి నొప్పి వచ్చింది. ఛాతీ నొప్పిని భరిస్తూనే డ్రైవర్ అహిర్ మరో 15 కి.మీ బస్సు నడిపి డిపోకు చేర్చాడు. అనంతరం గుండెపోటుతో కుప్పకూలాడు. హుటాహుటీన డ్రైవర్ అహిర్ను రాధన్పూర్ సివిల్ హాస్పిటల్కు తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు దృవీకరించారు.
మృతుడు అహిర్ ఆదివారం రాత్రి 8:30 గంటలకు బస్ డ్రైవింగ్ చేస్తూ సోమనాథ్ బయలుదేరారు. సోమవారం ఉదయం రాధన్పూర్ నుంచి 7:05 గంటలకు రాధన్పూర్ చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రయాణీకులు ఉదయం టీ బ్రేక్ కోసం వారాహి వద్ద కొద్దిసేపు బస్సు ఆపారు. ఆ సమయంలో అహిర్ తనకు ఛాతీ నొప్పిగా ఉన్నట్లు చెప్పాడని కండక్టర్ తెలిపాడు. గుండె నొప్పి వేధిస్తోన్నా పట్టించుకోకుండా బస్సులోని ప్రయాణీకులను హైవేపై ఒంటరిగా వదిలేయడానికి మనసొప్పలేదు. అందుకే బాధను భరిస్తూనే మరో 20 నిమిషాల పాటు నడిపి డిపోకు బస్సు చేర్చి మరణించాడని కండక్టర్ కన్నీటి పర్యాంతమయ్యాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.