Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘వెళ్లి చావండి’ .. స్కూల్ ఫీజులపై మొర పెట్టుకోవడానికి వెళ్లిన పేరెంట్స్‌పై విద్యాశాఖ‌ మంత్రి రుస‌రుస‌లు

క‌రోనా క‌ల్లోల స‌మయంలో స్కూల్స్ ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయని మొరపెట్టేందుకు వెళితే... 'వెళ్లి చావండి' అని మధ్యప్రదేశ్‌ విద్యా శాఖ మంత్రి ఇంద్ర సింగ్‌ పర్మార్‌

Viral Video: 'వెళ్లి చావండి' .. స్కూల్ ఫీజులపై మొర పెట్టుకోవడానికి వెళ్లిన పేరెంట్స్‌పై విద్యాశాఖ‌ మంత్రి రుస‌రుస‌లు
Mp Education Minister
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 30, 2021 | 7:19 PM

క‌రోనా క‌ల్లోల స‌మయంలో స్కూల్స్ ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయని మొరపెట్టేందుకు వెళితే… ‘వెళ్లి చావండి’ అని మధ్యప్రదేశ్‌ విద్యా శాఖ మంత్రి ఇంద్ర సింగ్‌ పర్మార్‌ వ్యాఖ్యానించడం ఇప్పుడు తీవ్ర చ‌ర్య‌నీయాంశ‌మైంది. కనీసం ఊరట కలిగించే మాటలు చెప్ప‌కుండా.. మంత్రి దిగ‌జారి కామెంట్స్ చేయ‌డంతో భోపాల్‌లోని తల్లిదండ్రుల సంఘం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. మా విజ్ఞప్తిని వినేందుకు విద్యా శాఖే నిరాకరిస్తే మా పరిస్థితి ఏంటని పేరెంట్స్ ప్ర‌శ్నిస్తున్నారు. మంత్రి మాట్లాడిన వ్యాఖ్య‌లు రికార్డ్ అవ్వ‌డంతో అవి కాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలను తల్లిదండ్రుల సంఘం ఖండించింది.పేరెంట్స్‌ కమిటీ పోరాటానికి ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా మద్దతు తెలిపింది. మంత్రి తక్షణమే ఈ పదవి నుండి వైదొలగాలని డిమాండ్ చేసింది.

90-100 మంది తల్లిదండ్రులు కలిసి ఏర్పడి… తమ మొర వినిపించేందుకు విద్యాశాఖ మంత్రి నివాసానికి వెళ్లారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. కోవిడ్ కారణంగా ఆదాయం లేదని, అంతంత ఫీజులు కట్టలేమని, దీనిపట్ల చర్యలు తీసుకొని సాయపడాలని కోరారు. ‘వెళ్లి చావండి.. మీకేమీ చేయాలనిపిస్తే అది చేయండి’ అంటూ మంత్రి బ‌దులిచ్చారు వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్ మీరు దిగువ వీడియోలో విన‌వ‌చ్చు.

Also Read: వామ్మో..! ఈ తాచుపాము మాముల్ది కాదు.. ఏకంగా 3 అడుగుల కోబ్రాను మింగేసింది.. కానీ

రోహిత్​కు సారీ చెప్పిన అతడి భార్య రితిక… ఎందుకో తెలుసా ?