AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెట్రో ఇంజనీర్ పేరుతో బ్యాంకుకే టోకరా.. ఫేక్‌ సర్టిఫికెట్లతో భారీగా రుణం.. ఆలస్యంగా వెలుగులోకి..

దరఖాస్తు చేయకపోయినా రుణం మంజూరైందని, ఇదేలా సాధ్యమంటూ బాధిత నవీన్.. బ్యాంకుకు ఫోన్ చేసి విచారించారు. దాంతో నవీన్ పేరుతో జరిగిన ఈ దారుణం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.

మెట్రో ఇంజనీర్ పేరుతో బ్యాంకుకే టోకరా.. ఫేక్‌ సర్టిఫికెట్లతో భారీగా రుణం.. ఆలస్యంగా వెలుగులోకి..
Fraud Calls
Jyothi Gadda
|

Updated on: Jun 06, 2023 | 1:22 PM

Share

మెట్రో ఇంజనీర్ పేరుతో నకిలీ పత్రం సృష్టించి అక్రమార్కులు ప్రైవేట్ బ్యాంకులో రుణం పొందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విధానసౌధ మెట్రో స్టేషన్‌ ఇంజనీర్‌ బీఆర్‌ నవీన్‌ కుమార్‌ మోసపోయారని, ఇటీవల బ్యాంకు నుంచి నవీన్‌ ఇంటికి వచ్చిన లేఖను పరిశీలించగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సెంట్రల్ డివిజన్‌లోని సీఈఎన్‌ స్టేషన్‌లో నవీన్‌కుమార్‌ ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. మెట్రో స్టేషన్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న నవీన్‌కుమార్‌ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి అక్రమార్కులు బ్యాంక్ అధికారులను బురిడీ కొట్టించి రూ. 51,839 వేల రూపాయలు తీసుకున్నారు. తర్వాత నవీన్ తన చిరునామాలో బ్యాంకు నుంచి వచ్చిన లెటర్ చూసి షాక్ అయ్యాడు. దరఖాస్తు చేయకపోయినా రుణం మంజూరైందని, ఇదేలా సాధ్యమంటూ బాధిత నవీన్.. బ్యాంకుకు ఫోన్ చేసి విచారించారు. దాంతో నవీన్ పేరుతో జరిగిన ఈ దారుణం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.

తనకు తెలిసిన వ్యక్తికి ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాను సృష్టించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి మెసెంజర్ ద్వారా ఫిర్యాదు దారుడికి ఇలా చెప్పాడు, “స్నేహితుడి కొడుకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్నాడు. అత్యవసరంగా రూ. డబ్బు కావాలి అంటూ మెసేజ్ పంపాడు. దీన్ని నమ్మిన ఫిర్యాదుదారుడు గుర్తు తెలియని వ్యక్తి పంపిన గూగుల్ పే నంబర్‌కు దశలవారీగా మొత్తం రూ.80,000 చెల్లించాడు. డబ్బు మొత్తం పంపిన తర్వాత గానీ అతనికి అర్థమైంది.. నకిలీ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా జరిగిన మోసమని తెలుసుకుని కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..