AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి న్యాయం జరగాలంటే.. మోదీపై మన్మోహన్ సింగ్ ఫైర్ .

గాల్వన్ వ్యాలీలో ఇటీవల చైనా సైనికుల దాడుల్లో మృతి చెందిన కల్నల్ సంతోష్ బాబు, మరో 19 మంది జవాన్ల కుటుంబాలకు న్యాయం జరగాలంటే ప్రధాని మోదీ,  ప్రభుత్వం కూడా ఈ సందర్భానికి తగినట్టు నడుచుకోవాలని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ..

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి న్యాయం జరగాలంటే.. మోదీపై మన్మోహన్ సింగ్ ఫైర్  .
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 22, 2020 | 1:23 PM

Share

గాల్వన్ వ్యాలీలో ఇటీవల చైనా సైనికుల దాడుల్లో మృతి చెందిన కల్నల్ సంతోష్ బాబు, మరో 19 మంది జవాన్ల కుటుంబాలకు న్యాయం జరగాలంటే ప్రధాని మోదీ,  ప్రభుత్వం కూడా ఈ సందర్భానికి తగినట్టు నడుచుకోవాలని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ సూచించారు. వారికి ఏం తక్కువ చేసినా ఈ దేశ ప్రజల విశ్వాసానికి చారిత్రక ద్రోహం చేసినట్టే అవుతుందని, ఈ తరుణానికి తగినట్టు నడచుకోకపోతే అది ద్రోహం కాక మరేమవుతుందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ తానేం మాట్లాడుతున్నారన్న దానిపై సదా అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. లదాఖ్ లో ఇటీవల ఇండో-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణపై మొదటిసారిగా స్పందించిన మన్మోహన్  సింగ్… ఈ సమయంలో  పభుత్వం తీసుకునే నిర్ణయాలు, చర్యలు మన భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని హెచ్చరించారు. ఈ ప్రజాస్వామ్యంలో బాధ్యత అన్నది పూర్తిగా ప్రధాని పైనే ఉంటుందని, దేశ భద్రత, ప్రాదేశిక ప్రయోజనాలపై మాట్లాడేటప్పుడు ప్రధాన మంత్రి తన మాటల ప్రభావాన్ని ఒకసారి మదింపు చేసుకోవాలని, అప్రమత్తత అవసరమని ఆయన పేర్కొన్నారు. గత శుక్రవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో మాట్లాడిన మోదీ.. మన భూభాగంలో ఎవరూ (చైనా దళాలు) లేరని, అలాగే మన సైనిక పోస్టుల్లో వేటినీ స్వాధీనం చేసుకోలేదని వ్యాఖ్యానించారు. . దీనిపై వెంటనే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తూ.. మరి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎందుకు పెరిగాయని ప్ప్రశ్నించింది. ప్రధాని మాటలను బట్టి చూస్తే.. మన భూభాగాన్ని చైనా స్వాధీనం చేసుకున్నట్టు ఉందని విపక్షాలు విమర్శించాయి. అయితే దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ఆ తరువాత వివరణ ఇస్తూ.. మోదీ వ్యాఖ్యలకు అపోహలను ఆపాదించే విధంగా విమర్శలు చేస్తున్నారని, లదాఖ్ లో నియంత్రణ రేఖ వద్ద నాడున్న పరిస్థితిని ఆయన ప్రస్తావించారని స్పష్టం చేసింది. అక్కడి యధాతథ పరిస్థితిపై విదేశాంగ శాఖ ఇఛ్చిన వివరణనే ఆయన గుర్తు చేశారని, అంతే తప్ప.. మన భూభాగాలను చైనా ఆక్రమించుకున్నట్టు ఆయన చెప్పనేలేదని క్లారిటీ ఇచ్చింది.

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత