AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి న్యాయం జరగాలంటే.. మోదీపై మన్మోహన్ సింగ్ ఫైర్ .

గాల్వన్ వ్యాలీలో ఇటీవల చైనా సైనికుల దాడుల్లో మృతి చెందిన కల్నల్ సంతోష్ బాబు, మరో 19 మంది జవాన్ల కుటుంబాలకు న్యాయం జరగాలంటే ప్రధాని మోదీ,  ప్రభుత్వం కూడా ఈ సందర్భానికి తగినట్టు నడుచుకోవాలని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ..

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి న్యాయం జరగాలంటే.. మోదీపై మన్మోహన్ సింగ్ ఫైర్  .
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 22, 2020 | 1:23 PM

Share

గాల్వన్ వ్యాలీలో ఇటీవల చైనా సైనికుల దాడుల్లో మృతి చెందిన కల్నల్ సంతోష్ బాబు, మరో 19 మంది జవాన్ల కుటుంబాలకు న్యాయం జరగాలంటే ప్రధాని మోదీ,  ప్రభుత్వం కూడా ఈ సందర్భానికి తగినట్టు నడుచుకోవాలని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ సూచించారు. వారికి ఏం తక్కువ చేసినా ఈ దేశ ప్రజల విశ్వాసానికి చారిత్రక ద్రోహం చేసినట్టే అవుతుందని, ఈ తరుణానికి తగినట్టు నడచుకోకపోతే అది ద్రోహం కాక మరేమవుతుందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ తానేం మాట్లాడుతున్నారన్న దానిపై సదా అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. లదాఖ్ లో ఇటీవల ఇండో-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణపై మొదటిసారిగా స్పందించిన మన్మోహన్  సింగ్… ఈ సమయంలో  పభుత్వం తీసుకునే నిర్ణయాలు, చర్యలు మన భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని హెచ్చరించారు. ఈ ప్రజాస్వామ్యంలో బాధ్యత అన్నది పూర్తిగా ప్రధాని పైనే ఉంటుందని, దేశ భద్రత, ప్రాదేశిక ప్రయోజనాలపై మాట్లాడేటప్పుడు ప్రధాన మంత్రి తన మాటల ప్రభావాన్ని ఒకసారి మదింపు చేసుకోవాలని, అప్రమత్తత అవసరమని ఆయన పేర్కొన్నారు. గత శుక్రవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో మాట్లాడిన మోదీ.. మన భూభాగంలో ఎవరూ (చైనా దళాలు) లేరని, అలాగే మన సైనిక పోస్టుల్లో వేటినీ స్వాధీనం చేసుకోలేదని వ్యాఖ్యానించారు. . దీనిపై వెంటనే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తూ.. మరి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎందుకు పెరిగాయని ప్ప్రశ్నించింది. ప్రధాని మాటలను బట్టి చూస్తే.. మన భూభాగాన్ని చైనా స్వాధీనం చేసుకున్నట్టు ఉందని విపక్షాలు విమర్శించాయి. అయితే దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ఆ తరువాత వివరణ ఇస్తూ.. మోదీ వ్యాఖ్యలకు అపోహలను ఆపాదించే విధంగా విమర్శలు చేస్తున్నారని, లదాఖ్ లో నియంత్రణ రేఖ వద్ద నాడున్న పరిస్థితిని ఆయన ప్రస్తావించారని స్పష్టం చేసింది. అక్కడి యధాతథ పరిస్థితిపై విదేశాంగ శాఖ ఇఛ్చిన వివరణనే ఆయన గుర్తు చేశారని, అంతే తప్ప.. మన భూభాగాలను చైనా ఆక్రమించుకున్నట్టు ఆయన చెప్పనేలేదని క్లారిటీ ఇచ్చింది.

Follow Us
29 ఏళ్ల వయసు చిన్నదైన భార్య.. ఈ తోపు విలన్ ప్రేమ కథ తెలిస్తే..
29 ఏళ్ల వయసు చిన్నదైన భార్య.. ఈ తోపు విలన్ ప్రేమ కథ తెలిస్తే..
తోబుట్టువులకు ఈ గిఫ్ట్స్ ఇస్తే సర్‌ప్రైజ్ ఖాయం.. బడ్జెట్‌లోనే..
తోబుట్టువులకు ఈ గిఫ్ట్స్ ఇస్తే సర్‌ప్రైజ్ ఖాయం.. బడ్జెట్‌లోనే..
ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. రూ.1.50లక్షల వరకు సబ్సిడీ
ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. రూ.1.50లక్షల వరకు సబ్సిడీ
సౌభాగ్య యోగం.. ఈ రాశుల వారికి పట్టింది బంగారమే!
సౌభాగ్య యోగం.. ఈ రాశుల వారికి పట్టింది బంగారమే!
గర్భిణీలను చూస్తే పాములకు కళ్లు కనిపించవా?అసలు కథ ఇదే
గర్భిణీలను చూస్తే పాములకు కళ్లు కనిపించవా?అసలు కథ ఇదే
భారత్‌పై వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన శ్రీలంక యువ బ్యాటర్
భారత్‌పై వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన శ్రీలంక యువ బ్యాటర్
GATE 2027 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు ఇవే
GATE 2027 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు ఇవే
అప్పట్లో రూ.36 లక్షలు పెట్టి కొన్న ల్యాండ్.. తర్వాత ఏమైందంటే
అప్పట్లో రూ.36 లక్షలు పెట్టి కొన్న ల్యాండ్.. తర్వాత ఏమైందంటే
రేపే చంద్రగ్రహణం..గ్రహణం పూర్తైన తర్వాత తప్పక చేయాల్సిన 4 పనులివే
రేపే చంద్రగ్రహణం..గ్రహణం పూర్తైన తర్వాత తప్పక చేయాల్సిన 4 పనులివే
తెలంగాణను యూపీ అనుకుంటున్నారా..? అసదుద్దీన్ ఒవైసీ ఫైర్
తెలంగాణను యూపీ అనుకుంటున్నారా..? అసదుద్దీన్ ఒవైసీ ఫైర్