AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food Poison: ప్రసాదం తిని వెయ్యి మందికిపైగా అస్వస్థత.. 40 గ్రామాల ప్రజల ప్రాణాలతో చెలగాటం

ప్రసాదం తిని వెయ్యి మందికి పైగా భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతూ స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలోని పూంచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరోడా గ్రామంలో గత శుక్రవారం (అక్టోబర్ 27)మాజీ ప్రధాన్ లఖన్ సింగ్ రాజ్‌పుత్ ఇంట్లో త్రయోదశి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన దాదాపు 2 వేలకు పైగా ప్రజలు..

Food Poison: ప్రసాదం తిని వెయ్యి మందికిపైగా అస్వస్థత.. 40 గ్రామాల ప్రజల ప్రాణాలతో చెలగాటం
Food Poision
Srilakshmi C
|

Updated on: Oct 31, 2023 | 10:34 AM

Share

కొచ్చిన్‌, అక్టోబర్‌ 31: ప్రసాదం తిని వెయ్యి మందికి పైగా భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతూ స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలోని పూంచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరోడా గ్రామంలో గత శుక్రవారం (అక్టోబర్ 27)మాజీ ప్రధాన్ లఖన్ సింగ్ రాజ్‌పుత్ ఇంట్లో త్రయోదశి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన దాదాపు 2 వేలకు పైగా ప్రజలు కుంటుంబంతో సహా హాజరయ్యారు. పూజ అనంతరం అనేక మంది అక్కడ పంచి పెట్టిన ప్రసాదం తిన్నారు. భోజనాలు కూడా చేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికే అనేక మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

దీంతో హుటాహుటీన సమీపంలోని పూంఛ్, సమతార్, మంత్లోని ప్రాంతాల్లో దాదాపు అన్ని ఆసుపత్రులకు బాధితులను తరలించారు. వారిలో పలువురికి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం మరికొందరిని ఝాన్సీ, గ్వాలియర్, కస్బా పూంచ్, సామ్తార్‌లలోని ఆసుపత్రులకు బాధితులను అంబులెన్స్‌లలో తరలించారు. రోగులకు తరలించేందుకు అంబులెన్స్‌లు సరిపోకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్డీఎం మనోజ్ కుమార్ సరోజ్, మంత్ సీహెచ్ సీ సూపరింటెండెంట్ మాతా ప్రసాద్ రాజ్‌పుత్ బరోడా గ్రామానికి చేరుకున్నారు. అనంతరం రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు ఇదే కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తనయుడు రాహుల్ రాజ్‌పుత్ కూడా అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో జిల్లా యంత్రాంగం ఆ గ్రామానికి చేరుకుని, విచారణ చేపట్టింది. ఆహార పదార్థాల నమూనాను సేకరించి పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపారు. ఈ ఘటనపై మాజీ ప్రధాన్ లఖన్ సింగ్ రాజ్‌పుత్ స్పందించారు. గత శుక్రవారం నాడు నిర్వహించిన త్రయోదశి కార్యక్రమానికి సమీపంలోని 40 గ్రామాలను ఆహ్వానించినట్లు ఆయన చెప్పారు. సుమారు రెండున్నర వేల మంది ఈ కార్యక్రమానికి పాల్గొన్నారన్నారు. తనను నేరుగా ఎదుర్కోలేక రాజకీయ ప్రత్యర్ధులే ఆహారంలో విషపదార్థాలు కలిపి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.