Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు కన్నకొడుకునే హత్య చేసిన తండ్రి.. ఎలా జరిగిందంటే

ముంబయిలోని ఓ తండ్రి తన రెండేళ్ల కుమారుడిపై కక్ష గట్టాడు. వివాహేతర సంబధానికి అడ్డుగా ఉన్నాడని ఆ చిన్నారి గొంతునులిమి హత్య చేశాడు. వివరాల్లకి వెళ్తేధారావిలో నివసిస్తున్న నిందితుడు(22) ఓ దుస్తుల ఫ్యాక్టరీలో టైలర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు కన్నకొడుకునే హత్య చేసిన తండ్రి.. ఎలా జరిగిందంటే
Child
Follow us
Aravind B

|

Updated on: Apr 20, 2023 | 1:20 PM

ముంబయిలోని ఓ తండ్రి తన రెండేళ్ల కుమారుడిపై కక్ష గట్టాడు. వివాహేతర సంబధానికి అడ్డుగా ఉన్నాడని ఆ చిన్నారి గొంతునులిమి హత్య చేశాడు. వివరాల్లకి వెళ్తేధారావిలో నివసిస్తున్న నిందితుడు(22) ఓ దుస్తుల ఫ్యాక్టరీలో టైలర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే తనను పెళ్లిచేసుకోవాలంటే అతడి భార్య, కుమారుడి అడ్డు తొలగించాలంటూ అతనికి ఆమె షరతు విధించింది. దీంతో ఆమెను ఎలాగైన పెళ్లి చేసుకోవాలని భావించిన నిందితుడు భార్య, కుమారుడిని హత్యచేయాలని కుట్ర పన్నాడు. చాక్లెట్‌ కొనిస్తానని చెప్పి భార్య నుంచి తన కుమారుడ్ని బయటకు తీసుకెళ్లాడు. అనంతరం ఆ బాలుడ్ని తమ కుటుంబానికి చెందిన దుకాణం వద్దకు తీసుకొచ్చాడు.

ఎవరూ లేని సమయాన్ని చూసి ఒక్కసారిగా ఆ చిన్నారి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం రాత్రి పూట మృతదేహాన్ని మీఠీ నదిలో పడేశాడు.అయితే ఆ బాలుడు కనిపించకపోవడంతో బంధువులు బుధవారం రోజున ఉదయం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నదిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం ప్లాస్టిక్‌ బ్యాగుతో కప్పి ఉందని తల, చేయి భాగాన్ని ఎలుకలు కొరికినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాలుడి తండ్రే హంతకుడని గుర్తించిన పోలీసులు అతడ్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..