Engineer’s Day: భావితరాలకు ఆదర్శం మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. తాగు, సాగునీటి ప్రాజెక్టుల రూపశిల్పి

Engineer's Day: సెప్టెంబ‌ర్ 15కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజును మనం 'ఇంజనీర్స్ డే' (ఇంజనీర్ల దినోత్సవం)గా జరుపుకుంటాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య..

Engineer's Day: భావితరాలకు ఆదర్శం మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. తాగు, సాగునీటి ప్రాజెక్టుల రూపశిల్పి
Engineer's Day
Follow us

|

Updated on: Sep 15, 2021 | 10:24 AM

Engineer’s Day: సెప్టెంబ‌ర్ 15కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజును మనం ‘ఇంజనీర్స్ డే’ (ఇంజనీర్ల దినోత్సవం)గా జరుపుకుంటాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ వేడుకను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. విశ్వేశ్వరయ్య భారత ఇంజనీర్‌గా గుర్తింపబడినవారు. ఇంకొద్ది క్షణాల్లో ఈ వంతెన కూలిపోతున్నది.. రైలును ఆపండి అంటూ కేకలు వేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన సునిశిత మేధావి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మేం మాటలతో కాలయాపన చేశాం.. మీరు నిరంతర క్రియాశూరులై నవభారత నిర్మాణా నికి కృషి చేసిన మహనీయులంటూ 1961 సెప్టెంబర్‌ 15న బెంగుళూరులో జరిగిన విశ్వేశ్వరయ్య శతాబ్ది వేడుకల్లో అప్పటి ప్రధాని నెహ్రూ చేత ప్రశంసలు పొందిన అపర భగీరథుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన 160f జయంతి సందర్భంగా ఈ కథనం.

విశ్వేశ్వరయ్య జననం- విద్యాభ్యాసం:

మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు బేస్తవారపేట మండలం మోక్షగుండం గ్రామానికి చెందినవారే. శ్రీనివాసశాస్ర్తి, వెంకటలక్ష్మమ్మలకు 1861 సెప్టెంబర్‌ 15న విశ్వేశ్వరయ్య జన్మించాడు. తల్లిదండ్రులు మోక్షగుండం గ్రామం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌ జిల్లా చిక్‌బల్లాపూర్‌ సమీపంలోని ముద్దనహళ్లికి వెళ్లి స్థిరపడ్డారు. ప్రాథమిక విద్య చిక్‌బల్లాపూర్‌లో సాగింది. తన 15వ ఏటనే తండ్రిని కోల్పోయిన విశ్వేశ్వరయ్య మేనమామ రామయ్య ప్రోత్సాహంతో బెంగుళూరు సెంట్రల్‌ కాలేజీలో 1880లో ఎం.ఎలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణుడ‌య్యారు.

గణితంలో ప్రతిభ కలిగిన విశ్వేశ్వరయ్యను మైసూరు రాజ్య దివాను రంగయ్య గుర్తించి ప్రభుత్వానికి సిఫారస్సు చేసి స్కాలర్‌షిప్‌ ఇప్పించారు. ఆ ఉపకార వేతనంతో ఆయన పూణే వెళ్లి ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. దీంతో బొంబాయి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పబ్లిక్‌ వర్క్స్‌ శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా నియమించింది. మరుసటి ఏడాది ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా నియమితులయ్యారు. ఆంగ్లపాలకులు విశ్వేశ్వరయ్య కార్యదీక్షను గుర్తించి ప్రపంచ జలాశయాల్లో ఒక్కటైన సుక్నూర్‌బరాజ్‌ నిర్మాణానికి ఇంజనీర్‌గా నియమించారు. దీంతో సింధూనది నీరు సుద్నోరుకు చేరేలా చేశాడు. ఆ నది నీరు వడగట్టడానికి ఒక వినూత్న విధానం రూపొందించారు. దాహరి దగ్గర నంబనది మీద సైఫన్‌ పద్ధతిన కట్ట నిర్మించారు. అక్కడ విశ్వేశ్వరయ్య మేధాశక్తితో ఆటో మేటిక్‌ గేట్లు నిర్మించి సమస్య తొలగించి అందరిని ఆశ్చర్యపరిచారు. 1909లో మైసూర్‌ ప్రభుత్వం ఆయనను చీఫ్‌ ఇంజనీర్‌ గా నియమించింది.

నీటి వృధాను అరికట్టేలా చర్యలు:

కృష్ణరాజసాగర్‌ డ్యాం డిజైన్‌ ఆయన ఆధ్వర్యంలోనే నిర్మాణం జరిగింది. దేశం లోనే తొలిసారిగా నీటి వృధాని అరికట్టేం దుకు నూతన చర్యలను చేపట్టారు ఈ మ‌హానుభావుడు. వర్షపు నీటిని ప్రాజెక్టుల ద్వారా నిలుపుదల చేయడం, ప్రవ హించే నీటిని అనకట్టలు, ఉక్కు తలుపుల ద్వారా అరికట్టడానికి రూపకల్పన చేసి తన ఆధ్వర్యంలోనే నిర్మాణాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ డ్రైనేజీ పద్ధతులకు రూప కల్పన చేసిందీ కూడా ఆయనే. ప్రముఖ ఇంజినీర్లు అయిన కె.ఎల్‌.రావు, జాఫర్‌ అలీలు కూడా ఆయన సహాయ సహకారాలు తీసుకున్న వారే. విశ్వేశ్వరయ్యకు 1948 లో మైసూర్‌ ప్రభుత్వం డాక్టరేట్‌ ఎల్‌ఎల్‌డి ఇచ్చి సత్కరించింది. అలాగే బాంబే, కలకత్తా, బెనారస్‌, అలహాబాద్‌ తదితర యూనివర్శిటీలు డాక్టరేట్‌ పురస్కారాలను అందజేశాయి. భారత ప్రభుత్వం 1955లో భారతరత్న అవార్డును ప్రధానం చేసి ఘనంగా సన్మానించింది. ఆయన ఇండియన్‌ ఇరిగేషన్‌ కమిషన్‌ సభ్యులుగా, కర్ణాటకలో చీఫ్‌ ఇంజనీరుగా అనేక బాధ్య తలను నిర్వహించి సివిల్‌ ఇంజనీరింగ్‌లో అప్పట్లోనే నూతన ఒరవడులను సృష్టించి ప్రపంచ స్థాయిలో రికార్డులు సాధించారు. అనంత‌రం 1962, ఏప్రిల్‌ 12న విశ్వేశ్వరయ్య క‌న్నుమూశారు. అయితే ఆయన పుట్టినరోజు సెప్టెంబర్‌ 15వ తేదీన ఇంజనీర్స్‌ డేగా జరుపుకొంటున్నారు. ఆయన పూర్వీకులు పూజించే దేవాలయం మోక్షగుండం ముక్తేశ్వరాలయం నేటికి భక్తులతో ప్రత్యేక పూజలు అందుకుంటుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకుల గ్రామం మోక్షగుండం గ్రామస్తులంటే కర్ణాటక రాష్ట్రంలో చాలా గౌరంగా చూస్తారు. విశ్వేశ్వరయ్య 101 సంవత్సరాలు జీవించి ఇంజనీరింగ్‌ రంగానికే పితామహుడయ్యారు.

విశ్వేశ్వరయ్య కృషికి గుర్తులు:

కృష్ణ రాజ సాగర్ ఆనకట్ట, బృందావన్ గార్డెన్, భద్రావతి ఉక్కు కర్మాగారం, మైసూర్ బ్యాంక్, దక్కన్ ప్రాంతంలో నీటిపారుదల వ్యవస్థ, స్వయంచాలిత వరదనీటి గేట్లు, హైదరబాద్ కు వరద నీటి రక్షణ వ్యవస్థ, విశాఖపట్టణం రేవులో భూకోతను నివారించడం, తిరుమల, తిరుపతి మధ్య రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక, ఆసియాలోనే మొదటి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్, మైసూర్ సబ్బుల ఫ్యాక్టరీ, శ్రీ జయాచామరాజేంద్ర పాలిటెక్నిక్ కళాశాల, బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, మైసూర్ చక్కెర మిల్లులు.

ఇవీ కూడా చదవండి:

Bank Account: ఈ బ్యాంకులో ఖాతా తెరిస్తే ఉచిత క్రెడిట్‌ కార్డు.. రూ.30 లక్షల ప్రయోజనాలు.. ఇంకా మరెన్నో..!

Sim Fraud: రూ.11 రీచార్జ్‌ చేసినందుకు బ్యాంకు అకౌంట్‌ నుంచి రూ.6 లక్షలు మయం.. మోసగాడి వలలో సీనియర్‌ సిటిజన్‌

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..