AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Liquor Policy Case: మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన ED.. రెండవ రోజు తీహార్‌లో విచారించనున్న అధికారులు

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్టుకు ముందు ఆప్ నేత సిసోడియాను ఢిల్లీలోని తీహార్ జైలులో సుదీర్ఘంగా విచారించారు.

Delhi Liquor Policy Case: మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన ED..  రెండవ రోజు తీహార్‌లో విచారించనున్న అధికారులు
Manish Sisodia
Sanjay Kasula
|

Updated on: Mar 09, 2023 | 7:00 PM

Share

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సిసోడియాను ఈడీ గురువారం (మార్చి 9) రెండోసారి ప్రశ్నించింది. ఈమేరకు మంగళవారం జైలులో సిసోడియాను ఈడీ ప్రశ్నించింది. ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీ కోర్టు సోమవారం ఆయనను మార్చి 20 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. సీబీఐ కేసులో మనీష్ సిసోడియా బెయిల్‌పై కూడా శుక్రవారం విచారణ జరగనుంది.

జైలులో సిసోడియాను రెండుసార్లు..

మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సిసోడియా వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు మంగళవారం ఈడీ అధికారులు తీహార్ జైలుకు చేరుకున్నారు. సిసోడియాను విచారించేందుకు ఈడీ కోర్టు అనుమతి తీసుకుంది. మనీలాండరింగ్ నేరంలో వ్యక్తి దోషి అని దర్యాప్తు అధికారి నమ్మడానికి కారణాలను కనుగొంటే, ED PMLAలోని సెక్షన్ 19ని అమలు చేస్తుంది, ఇది కేసులో ప్రమేయం ఉన్న లేదా నిందితులను అరెస్టు చేయడానికి అనుమతిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం