Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళలే రథసారధులుగా అగర్భత్తి పార్కు ఏర్పాటు.. ఒక్కో యూనిట్‌కు రూ.42లక్షలు..దేశంలోనే తొలిసారిగా..

ఒక్కో యూనిట్ ఏర్పాటుకు 42 లక్షలు అవసరమైంది. వాటాదారులు 4 లక్షలు పెట్టుబడి పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం నుండి 11 లక్షలు సబ్సిడీ ఇచ్చారు. మిగిలిన రూ. 27 లక్షలు బ్యాంకు రుణం ద్వారా పొందారు. 10 యంత్రాలు ఉన్నాయి. ఒక్కో యూనిట్ 10-15 మందికి ఉపాధి కల్పిస్తోంది.

మహిళలే రథసారధులుగా అగర్భత్తి పార్కు ఏర్పాటు.. ఒక్కో యూనిట్‌కు రూ.42లక్షలు..దేశంలోనే తొలిసారిగా..
Agarbatti
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 29, 2023 | 9:14 PM

అగర్బత్తి తయారీ చాలా మంది అమ్మాయిలకు ఆర్థికంగా స్వతంత్రంగా మారడానికి ఒక మార్గంగా మారింది.. ఎందరో మహిళలు అగర్బత్తిని తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలోని విదర్భకు సమీపంలో ఉన్న ఉమ్రేడ్ అనే నగరం ఇప్పుడు పూర్తిగా మహిళలచే నిర్వహించబడే దేశంలోని మొట్టమొదటి ‘అగర్‌బత్తి పార్క్’గా గుర్తించబడింది. ఉమ్రెడ్ నగరంలో 42 చిన్న అగబరతి తయారీ యూనిట్లు ఉన్నాయి. వారు ఉమ్రేడ్ మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MIDC) భవనంలో ఉంటున్నారు. వారంతా అగరబత్తుల తయారీలో నిమగ్నమై ఉంటారురు. ఐటీసీ, రంగారావు అండ్ సన్స్ వంటి ప్రముఖ కంపెనీల అగర్బత్తి యూనిట్లు ఉన్నాయి. ఈ కంపెనీలు అగర్బత్తి సువాసన, ప్యాకేజింగ్, బ్రాండింగ్‌ను తమ స్వంత ట్రేడ్‌మార్క్‌తో ఇక్కడ చేస్తాయి. ఉమ్రేద్ అగరాబట్టి పార్క్ కనీసం వెయ్యి మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పించింది.

ఉమ్రేద్‌లోని అగరాబత్తి పార్క్ స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా వారికి ఆర్థిక మద్దతునిస్తోంది. ఈ ప్రాజెక్ట్ నాకు ఒక వరం. మూడు నెలల క్రితం ఈ క్లస్టర్‌లో చేరకముందు నేను గృహిణిని. నా భర్త షూ తయారీలో పనిచేస్తున్నాడు. కుటుంబ ఆదాయానికి అనుబంధంగా నాకు ఉద్యోగం అవసరం. ప్రస్తుతం నాకు రోజుకు రూ.200 వస్తోంది. పొందడం రానున్న రోజుల్లో పరిశ్రమ మరింత విస్తరిస్తుందని, వేతనాలు పెరుగుతాయని ఉమ్రేద్ అగరాబత్తి పార్కులో పనిచేస్తున్న రూపాలీ దేవ్ గుణే చెబుతున్నారు.

ఉమ్రేద్ అగర్బత్తి పార్క్ 26 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఉత్పత్తి, పెర్ఫ్యూమ్, మార్కెటింగ్ వరకు అన్ని పనులను నాగ్‌పూర్ అగర్బత్తి మార్కెటింగ్ అసోసియేషన్ చేస్తోంది. భారతదేశంలో ముడి అగర్బత్తికి సంవత్సరానికి 2.2 లక్షల టన్నులు అవసరం.

ఇవి కూడా చదవండి

ఉమ్రేద్ అగర్బత్తి పార్క్ అగర్బత్తి దేశీయ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. వెదురు నిపుణుడు ప్రతాప్ గోస్వామి ఈ ప్రాజెక్టును రూపొందించారు, దీనికి ముఖ్యమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (CMEGP) మద్దతు ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చిన్న, సూక్ష్మ పరిశ్రమలను స్థాపించడం దీని లక్ష్యం.

ఇది 2017లో ప్రారంభమైన దీర్ఘకాలిక ప్రక్రియ. కాన్సెప్ట్‌ను ప్రజలకు వివరించడం, వారిని పనిలోకి తీసుకురావడం, రుణాలు పొందడం మరియు యంత్రాలు అమర్చడం వంటి ప్రతిదానికీ చాలా శ్రమ అవసరం. ఐదేళ్ల కృషితో అంతా సాధ్యమైందని గోస్వామి అన్నారు. ఒక్కో యూనిట్ ఏర్పాటుకు రూ. 42 లక్షలు అవసరమైంది. వాటాదారులు 4 లక్షలు పెట్టుబడి పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం నుండి 11 లక్షలు సబ్సిడీ ఇచ్చారు. మిగిలిన రూ. 27 లక్షలు  బ్యాంకు రుణం ద్వారా పొందారు. 10 యంత్రాలు ఉన్నాయి. ఒక్కో యూనిట్ 10-15 మందికి ఉపాధి కల్పిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..