అప్పటికే తీవ్ర అనారోగ్యం..విమానం గాల్లో ఉండగా ..వీడియో
విమానం ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయి గాల్లో ఉండగా.. అందులోని ప్రయాణికుడు ఆకస్మికంగా మృతి చెందాడు. దీంతో ఫ్లైట్ ని పైలట్లు మార్గమధ్యంలో ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో ఒక ప్యాసింజర్ హఠాత్తుగా చనిపోవడంతో విమానాన్ని లక్నో ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మృతుడిని అస్సాం రాష్ట్రంలోని నల్బారి ప్రాంతానికి చెందిన సతీష్ బర్మన్గా గుర్తించారు.
ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలో చికిత్స పొందేందుకు తన భార్య కంచన్, మేనల్లుడు కేశవ్ కుమార్తో బయలుదేరారు. అయితే ఢిల్లీ చేరుకోకముందే ఆయన తుదిశ్వాస విడిచారు. సతీష్ బర్మన్ మరణించడంతో విమాన సిబ్బంది.. ఫ్లైట్ ను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. సతీష్ బర్మన్ ఆరోగ్యం విషమంగా ఉందని గమనించిన సిబ్బంది.. వెంటనే స్పందించి విమానాన్ని ల్యాండ్ చేయాలని నిర్ణయించారు. కానీ ల్యాండింగ్ కు ముందే సతీష్ చనిపోవడం విషాదకరం. ఇటీవల సూరత్-కోల్కతా విమానంలో ఓ ప్రయాణికుడు బీడీ తాగుతూ సిబ్బందికి పట్టుబడ్డారు. విమానంలోని వాష్రూమ్ నుంచి పొగ, వాసన రావడం గమనించిన సిబ్బంది తనిఖీలు చేపట్టి, పశ్చిమబెంగాల్కు చెందిన అశోక్ బిశ్వాస్ బ్యాగ్లో బీడీలు మరియు అగ్గిపెట్టె ఉన్నట్లు గుర్తించారు. అతడు వాష్రూమ్లో బీడీ తాగినట్లు అధికారులు గుర్తించి, వెంటనే అతడిని విమానంలోని ప్రదేశం నుంచి దింపారు.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

