DMK leader’s murder: డీఎంకే నేత దారుణ హత్య, శరీరాన్ని ముక్కలుగా నరికేసిన మహిళ..ఇప్పటికీ దొరకని తల..!

వివాహేతర సంబంధం కారణంగా డీఎంకే నేత దారుణ హత్యకు గురయ్యారు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి పలు చోట్ల పడేశారు. చెన్నైలోని ఓ మురికి కాలువలో శరీర భాగాలు దొరికినట్టుగా తెలిసింది. ఇక్కడ మరో షాకింగ్‌ విషయం ఏంటంటే..

DMK leader's murder: డీఎంకే నేత దారుణ హత్య, శరీరాన్ని ముక్కలుగా నరికేసిన మహిళ..ఇప్పటికీ దొరకని తల..!
Dmk Leader's Murder
Follow us

|

Updated on: May 14, 2022 | 5:25 PM

ఇటీవలి కాలంలో ఎంతో మంది వివాహేతర సంబంధాల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. హత్యలకు ఆత్మహత్యలకు, మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా తమిళనాడులోని చెన్నై మహానగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా డీఎంకే నేత దారుణ హత్యకు గురయ్యారు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి పలు చోట్ల పడేశారు. చెన్నైలోని ఓ మురికి కాలువలో శరీర భాగాలు దొరికినట్టుగా తెలిసింది. ఇక్కడ మరో షాకింగ్‌ విషయం ఏంటంటే..ఎంత వెతికినా అతడి తల మాత్రం దొరకలేదట. పోలీసులు తల కోసం ఇప్పటికీ గాలిస్తున్నారు. వారం రోజుల తరువాత కేసును చేధించారు పోలీసులు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పరిశీలించగా..

మృతుడు మనాలికి చెందిన ఎస్‌ చక్రపాణిగా గుర్తించారు పోలీసులు. చక్రపాణి మరోవైపు వడ్డీ వ్యాపారం కూడా సాగిస్తున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే చక్రపాణి స్థానికంగా ఉంటున్న సయారా భానుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపణ. ఇదిలా ఉండగానే, చక్రపాణి , సయారా భాను మధ్య విభేదాలు వచ్చినట్టుగా తెలిసింది. విభేదాల కారణంగానే చక్రపాణి ని తన బంధువుల సహాయంతో హత్య చేసి తలని కాలువలో పడేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. శరీరాన్ని ముక్కలుగా నరికి పలు ప్రాంతాలలో పడేసినట్టుగా గుర్తించారు. వారం రోజుల తరువాత కేసుని చేధించిన పోలీసులు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. హత్యకు సహకరించిన మరోకరు పరారీలో ఉన్నట్టుగా తెలిసింది. వారికోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

హత్యకు గల అసలు కారణం ఎంటని పోలీసులు ఆరా తీయగా డబ్బు వివాదంగా తెలిసింది. సయరా భాను దంపతులు మనాలిలో నివసించినప్పుడు చక్రపాణి వద్ద కొంత నగదు అప్పుగా తీసుకున్నారని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత భాను రాయపురం మకాం మార్చారు. అప్పుడు కూడా చక్రపాణి తరచూ ఆమెను కలిసేవాడట. ఈ క్రమంలోనే తన భర్త సూచన మేరకు ఓ రోజు చక్రపాణిని ఇంటికి ఆహ్వానించింది. ఆ తర్వాత భార్యాభర్తలు, మరో స్నేహితుడి సాయంతో చక్రపాణిని హత్య చేశారని డెడ్‌బాడీని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు తల, మొండెం వేరు చేసినట్టు పోలీసులు తేల్చారు.

Annavaram Temple: సత్యదేవుని ఉత్సవాల్లో అపచారం.. మందు, చిందులతో అశ్లీలం, చర్యలు తప్పవంటున్న ఆలయ ఈవో..

TTD VIP break darshan: వెంకన్న భక్తులకు ముఖ్య గమనిక..! సామాన్యులకు టీటీడీ పెద్దపీట వేసింది

Telangana : కర్మ భూమిలో పూసిన పూలు, కాళ్ల పారాణితో కాటిబాటపట్టిన పెళ్లికూతుళ్లు..మొన్న సృజన, నేడు లక్ష్మీ..