AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: బ్యాంకుల మాదిరిగానే పోస్టాఫీసు ఖాతాల్లోనూ ఆన్‌లైన్ ఫండ్ ట్రాన్స్‌ఫర్: ప్రధాని మోడీ

డిజిటల్ రూపాయి ఫిన్‌టెక్ రంగానికి కొత్త అవకాశాలను తెరుస్తుందని, డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపునిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

PM Modi: బ్యాంకుల మాదిరిగానే పోస్టాఫీసు ఖాతాల్లోనూ ఆన్‌లైన్ ఫండ్ ట్రాన్స్‌ఫర్: ప్రధాని మోడీ
Modi
Balaraju Goud
|

Updated on: Feb 02, 2022 | 3:35 PM

Share

PM Modi on Digital Currency: డిజిటల్ రూపాయి ఫిన్‌టెక్ రంగానికి కొత్త అవకాశాలను తెరుస్తుందని, డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపునిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi)  అన్నారు. నేటి వార్తాపత్రికలలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(Digital Currency) గురించి కూడా చాలా చర్చలు జరుగుతున్నాయన్నారు. ఇది డిజిటల్ ఆర్థిక వ్యవస్థ(Economy Sector)కు పెద్ద ఊపునిస్తుందన్న ప్రధాని.. ఇప్పుడు మన భౌతిక కరెన్సీ అయిన ఈ డిజిటల్ రూపాయికి డిజిటల్ రూపం ఉంటుందన్నారు. అంతేకాదు ఇది RBIచే నియంత్రించడం జరుగుతుంది. ఇది భౌతిక కరెన్సీతో మార్పిడి చేసుకోవచ్చు. డిజిటల్ రూపాయి ఫిన్‌టెక్ రంగానికి కొత్త అవకాశాలను తెరుస్తుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. 2022 బడ్జెట్‌పై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

బ్యాంకుల మాదిరిగానే పోస్టాఫీసు ఖాతాల్లోనూ ఆన్‌లైన్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ప్రధాని మోడీ తెలిపారు.పోస్టాఫీసులో సుకన్య సమృద్ధి ఖాతాలు మరియు PPF ఖాతాలు ఉన్న వ్యక్తులు వారి బ్యాంకు ఖాతా నుండి నేరుగా ఆన్‌లైన్‌లో వాయిదాలను బదిలీ చేసుకోవచ్చని ప్రధాన మంత్రి చెప్పారు. పోస్టాఫీసులో సుకన్య సమృద్ధి ఖాతా, PPF ఖాతా ఉన్నవారు కూడా తమ వాయిదాలను డిపాజిట్ చేయడానికి పోస్టాఫీసుకు వెళ్లవలసిన అవసరం లేదు. ఇప్పుడు వారు తమ బ్యాంకు ఖాతా నుండి నేరుగా ఆన్‌లైన్‌లో బదిలీ చేయగలుగుతారు” అని ప్రధాని తెలిపారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATM, ఆన్‌లైన్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యం బ్యాంకుల వంటి పోస్టాఫీసు ఖాతాలలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం, దేశంలో 1.5 లక్షలకు పైగా పోస్టాఫీసులు ఉన్నాయి. వాటిలో ఎక్కువ భాగం గ్రామాల్లో ఉన్నాయని ప్రధాని గుర్తు చేశారు. అతి త్వరలో అన్ని గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని పూర్తి చేస్తామని ప్రధాని చెప్పారు. తద్వారా పోస్టాఫీస్ లావాదేవీలు సులభం అవుతాయని ప్రధాని వివరించారు. ఈరోజు చౌకైన, వేగవంతమైన ఇంటర్నెట్ భారతదేశం గుర్తింపుగా మారింది. త్వరలోనే అన్ని గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ పూర్తవుతుంది. 5G సేవ భారతదేశంలో సౌలభ్యం, సులభంగా వ్యాపారం చేయడం కోసం విభిన్న కోణాన్ని అందించబోతోందని ప్రధాని అన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్ 2022-23ను ప్రవేశపెట్టారు.డిజిటల్ ఆస్తుల బదిలీల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధించనున్నట్లు సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ చర్యను ‘క్రిప్టో ట్యాక్స్’గా పరిగణిస్తున్నారు. క్రిప్టోకరెన్సీల రూపంలో అందుకున్న బహుమతులపై కూడా అదే రేటు పన్ను విధించడం జరుగుతుంది. క్రిప్టోకరెన్సీ బహుమతులు రిసీవర్ చివరిలో కూడా పన్ను విధిస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ రూపాయిని జారీ చేస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

డిజిటల్ అసెట్స్ మార్కెట్‌ను నియంత్రించేందుకు, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ, రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, మరిన్ని సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించడంతో బిల్లును ప్రవేశపెట్టలేదు.,సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపునిస్తుందని సీతారామన్ అన్నారు. డిజిటల్ కరెన్సీ మరింత సమర్థవంతమైన మరియు చౌకైన కరెన్సీ నిర్వహణ వ్యవస్థకు దారి తీస్తుందని మరియు ఇది బ్లాక్‌చెయిన్, ఇతర సాంకేతికతలను ఉపయోగిస్తుందని మంత్రి చెప్పారు.

Read Also…  Artificial Womb: అమ్మగా మారుతున్న రోబో.. అన్ని తానై మీకు నచ్చినట్లుగా.. అదే పనిలో చైనా పరిశోధకులు..