Dharmendra Pradhan: ఇది కాంగ్రెస్ మనస్తత్వం.. కొత్త పార్లమెంటుపై జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ఎద్దేవ
BJP Congress war: పాత పార్లమెంట్ గురించి కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ.. పాత భవనం ప్రత్యేకతే వేరు. రెండు సభలు, సెంట్రల్ హాల్, కారిడార్ల మధ్య నడవడం సులభం. అయితే కొత్త పార్లమెంట్లో దాని లోటు కనిపిస్తోంది. కొత్త పార్లమెంట్లో చర్చల అవకాశం గణనీయంగా తగ్గిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ధీటుగా సమాధానం ఇచ్చింది. ఇది కాంగ్రెస్ మనస్తత్వం అని.. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇలానే చేసిందంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..

నూతన పార్లమెంట్ భవనంపై కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. పార్లమెంట్ భవనంను మోదీ మల్లీప్లెక్స్ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విటర్ వేదికగా ఆరోపించయడంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధీటుగా సమాధానం ఇచ్చారు. జైరామ్ రమేష్ వేదన తమకు అర్థమైందంటూనే.. ఒక రాజవంశం, దాని ప్రభువుల నిస్పృహ వ్యక్తీకరణ ఇదంటూ ఎద్దేవ చేశారు. ఒక రాజవంశ వైరాగ్యం అతనికి మాటల్లో కనిపిస్తోందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు
పార్లమెంటు పాత భవనం సరిపోదని, ఉభయ సభల అవసరాలను తీర్చే విధంగా అది లేదని మాజీ స్పీకర్ మీరా కుమార్ నొక్కిచెప్పిన విషయాన్ని లోక్సభలో వారి నాయకురాలు సోనియా గుర్తు చేసిన సంగతిని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు, జైరామ్ రమేష్ జీ, తన ఉన్నతాధికారుల సూచనల మేరకు.. వేరే ట్యూన్ ప్లే చేస్తున్నారని విమర్శించారు. భారతదేశం ఆకాంక్షలకు చిహ్నంగా ఈ నూతన భవనం ఉందన్నారు. ప్రధాని మోదీ ద్వారా ముందుకు సాగిన మహిళా రిజర్వేషన్ను అమలు చేసిన తర్వాత పార్లమెంటులో చేరే మహిళా చట్టసభ సభ్యులకు నిలయంగా ఇది ఉపయోగపడుతుందన్నారు.
Jairam Ramesh ji’s agony is an expression of the despair of a dynasty and its nobles over the loss of what they considered to be a fief. It was only the other day that his leader in the Lok Sabha had said former Speaker Meira Kumar had emphasised that the old building of… https://t.co/CIntLztESE
— Dharmendra Pradhan (@dpradhanbjp) September 23, 2023
నూతన పార్లమెంట్ను మోదీ మల్టీప్లెక్స్ లేదా మోదీ మారియట్ అని పిలవాలని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇదీ కాంగ్రెస్ దయనీయ మనస్తత్వం అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ వ్యాఖ్యలపై స్పందించారు.. అదే సమయంలో ఇది దాదాపు 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు అవమానం తప్ప మరొకటి కాదన్నారు. పార్లమెంట్ వ్యతిరేక వైఖరిని కాంగ్రెస్ అనుసరించడం ఇదే తొలిసారి కాదని అన్నారు. 1975లో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమైందని అన్నారు.
Even by the lowest standards of the Congress Party, this is a pathetic mindset. This is nothing but an insult to the aspirations of 140 crore Indians.
In any case, this isn’t the first time Congress is anti-Parliament. They tried in 1975 and it failed miserably.😀 https://t.co/QTVQxs4CIN
— Jagat Prakash Nadda (@JPNadda) September 23, 2023
గిరిరాజ్ సింగ్ కూడా దాడి..
నడ్డా మాత్రమే కాదు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా జైరాం రమేష్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రి ట్వీట్ చేస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న రాజవంశ పునాదులను విశ్లేషించి, హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని నేను డిమాండ్ చేస్తున్నాను. స్టార్టర్స్ కోసం, 1 సఫ్దర్జంగ్ రోడ్ కాంప్లెక్స్ను వెంటనే భారత ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలి. ప్రధానమంత్రులందరికీ ఇప్పుడు పీఎం మ్యూజియంలో స్థలం అందుబాటులోకి వచ్చింది. 1 సఫ్దర్జంగ్ రోడ్ ఇందిరా గాంధీ అధికారిక నివాసం, ఆమె హత్య తర్వాత మ్యూజియంగా మార్చబడింది.
I demand that the #DynasticDens all over India need to be assessed and rationalised. For starters, the 1, Safdarjung Road complex be immediately transferred back to the Government of India considering all Prime Ministers have their space at the PM Museum now. https://t.co/5OfaMqHtDh
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) September 23, 2023
జైరాం రమేష్ ఏమన్నారు?
కాంగ్రెస్కు చెందిన జైరాం రమేష్ ట్వీట్ చేసిన తర్వాత బిజెపి నాయకుల నుండి తీవ్ర దాడి జరిగింది.. “కొత్త పార్లమెంటు భవనం భారీ ప్రచారంతో ప్రారంభించబడింది. ఇది ప్రధానమంత్రి లక్ష్యాలను సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది. ఈ భవనాన్ని మోదీ మల్టీప్లెక్స్ లేదా మోదీ మారియట్ అని పిలవాలి.
ఆయన ఇంకా మాట్లాడుతూ, “కొత్త పార్లమెంటులో నాలుగు రోజుల కార్యకలాపాల తర్వాత, ఉభయ సభలలో మరియు లాబీలో సంభాషణ మరియు చర్చ ముగిసినట్లు నేను కనుగొన్నాను. వాస్తుశిల్పం ప్రజాస్వామ్యాన్ని చంపగలిగితే, రాజ్యాంగాన్ని తిరిగి వ్రాయకుండానే ఈ లక్ష్యంలో ప్రధాని ఇప్పటికే విజయం సాధించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం




