AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళి బోనస్ ఇవ్వలేదని యజమానిని దారుణంగా హత్య చేసిన ఉద్యోగులు.. కారుతో పరార్‌..

కుమార్తె తన తండ్రికి ఫోన్ చేయగా, అతడు ఎంతకీ స్పందించలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో దాబా సమీపంలో ఉన్న పాన్ షాపు యజమానికి ఫోన్ చేశారు. ఏం జరిగిందోనని ఆరా తీసేందుకు దాబాకు చేరుకున్న పాన్‌ షాప్‌ యజమాని.. రక్తపు మడుగులో పడివున్న ధెంగ్రేను గమనించాడు.. ఒక్కసారిగా షాక్‌కు గురైన అతడు వెంటనే కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించాదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితిని

దీపావళి బోనస్ ఇవ్వలేదని యజమానిని దారుణంగా హత్య చేసిన ఉద్యోగులు.. కారుతో పరార్‌..
Murder
Jyothi Gadda
|

Updated on: Nov 12, 2023 | 1:52 PM

Share

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దీపావళి బోనస్ ఇవ్వలేదనే కోపంతో దాబా యజమానిని అతని ఇద్దరు ఉద్యోగులు కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉద్యోగుల దీపావళి బోనస్ డిమాండ్‌ను యజమాని తిరస్కరించడంతో శనివారం తెల్లవారుజామున నాగ్‌పూర్ గ్రామీణ ప్రాంతంలోని కుహి ఫాటా సమీపంలోని ధాబా వద్ద ఉద్యోగులు యజమాని గొంతు కోసి, కత్తితో పొడిచి, కొట్టి దారుణంగా హతమార్చారు. మృతుడు రాజు ధెంగ్రేగా గుర్తించారు. దాడికి పాల్పడిన వ్యక్తులు మధ్యప్రదేశ్‌లోని మండలా వాసులు ఛోటూ, ఆదిగా గుర్తించారు. సుమారు నెల రోజుల క్రితం నగరంలోని మధ్యప్రదేశ్ రాష్ట్ర బస్టాప్ సమీపంలో లేబర్ కాంట్రాక్టర్ ద్వారా నిందితులైన ఈ ఇద్దరినీ ధెంగ్రే తన దాబాలో పనిలో నియమించుకున్నాడని పోలీసులు తెలిపారు.

దీపావళి రోజున డబ్బు, బోనస్ కోసం ఇద్దరూ డిమాండ్‌ చేశారు. అందుకు యజమాని అంగీకరించలేదు. దాంతో ఆది, చోటూతో ధెంగ్రే వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు తెలిపారు. దాంతో కోపం పెంచుకున్న ఆ ఇద్దరు రాత్రి భోజనం చేసిన తర్వాత దేంగ్రే మంచం మీద పడుకుని నిద్రపోతుండగా దాడికి తెగబడ్డారు. ఇదిలా ఉండగానే, ధెంగ్రే కుమార్తె తన తండ్రికి ఫోన్ చేయగా, అతడు ఎంతకీ స్పందించలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో దాబా సమీపంలో ఉన్న పాన్ షాపు యజమానికి ఫోన్ చేశారు. ఏం జరిగిందోనని ఆరా తీసేందుకు దాబాకు చేరుకున్న పాన్‌ షాప్‌ యజమాని.. రక్తపు మడుగులో పడివున్న ధెంగ్రేను గమనించాడు.. ఒక్కసారిగా షాక్‌కు గురైన అతడు వెంటనే కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించాదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితిని పరిశీలించారు. నిందితులిద్దరూ అతన్ని గొంతుకోసి, ఆపై బరువువైన వస్తువుతో అతని తలపై కొట్టారు. పదునైన ఆయుధంతో అతని ముఖంపై దాడి చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన ఉదంతాన్ని వివరించారు.

మృతుడు ధేంగ్రే, కుహి తాలూకాలోని సుర్గావ్ గ్రామానికి చెందిన మాజీ ‘సర్పంచ్’ అని తెలిసింది. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ ఘటనకు సంబంధించి ఏరియా ఎస్పీ హర్ష్ ఎ పొద్దార్ మాట్లాడుతూ హత్య వెనుక ప్రాథమిక కారణం డబ్బే అని తెలుస్తుందన్నారు. అయితే,’రాజకీయ వైరానికి సంబంధించిన కోణం కూడా ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్టుగా చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
పచ్చిరొట్టె పంటగా ఏ నేలకు ఏది మంచిదో తెలుసుకుందామా..?
పచ్చిరొట్టె పంటగా ఏ నేలకు ఏది మంచిదో తెలుసుకుందామా..?
మగాళ్లు Vs మహిళలు.. రిలేషన్‌షిప్‌లో ఎవరు ఎక్కువ మోసం చేస్తారు..?
మగాళ్లు Vs మహిళలు.. రిలేషన్‌షిప్‌లో ఎవరు ఎక్కువ మోసం చేస్తారు..?
ప్రభాస్ చెప్పిన ఆ ఒక్క మాట విని ఆశ్చర్యపోయా...
ప్రభాస్ చెప్పిన ఆ ఒక్క మాట విని ఆశ్చర్యపోయా...
రెమ్యూనరేషన్ తక్కువే.. కానీ రాయల్టీ రూపంలో ఆ పాట సిరులు తెచ్చింది
రెమ్యూనరేషన్ తక్కువే.. కానీ రాయల్టీ రూపంలో ఆ పాట సిరులు తెచ్చింది
సినీ పరిశ్రమకు డ్రగ్స్ సరఫరా..? ఈగల్ దాడుల్లో షాకింగ్ నిజాలు!
సినీ పరిశ్రమకు డ్రగ్స్ సరఫరా..? ఈగల్ దాడుల్లో షాకింగ్ నిజాలు!
40 ఏళ్లు దాటాక ప్రాణస్నేహితులు కూడా ఎందుకు దూరమవుతారు?కారణాలు ఇవే
40 ఏళ్లు దాటాక ప్రాణస్నేహితులు కూడా ఎందుకు దూరమవుతారు?కారణాలు ఇవే
అమ్మ రాలేదంటూ.. కన్నీళ్లు పెట్టిన గోల్ కీపర్.. ఎందుకంటే?
అమ్మ రాలేదంటూ.. కన్నీళ్లు పెట్టిన గోల్ కీపర్.. ఎందుకంటే?
మిథున రాశిలోకి రవి.. ఆ రాశుల వారికి నెల రోజులు కష్టనష్టాలు..!
మిథున రాశిలోకి రవి.. ఆ రాశుల వారికి నెల రోజులు కష్టనష్టాలు..!
పిల్లల ఫ్యూచర్ కోసం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో లిప్ స్టిక్ నిషేధం
పిల్లల ఫ్యూచర్ కోసం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో లిప్ స్టిక్ నిషేధం
కరెంట్ బిల్లు చూసి.. ఆత్మహత్య చేసుకున్నాడు!
కరెంట్ బిల్లు చూసి.. ఆత్మహత్య చేసుకున్నాడు!