AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎట్టకేలకు బెయిల్.. జైలు నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ విడుదల.. ఘన స్వాగతం పలికి అభిమానులు..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 156 రోజుల తర్వాత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. తీహార్ జైలు వెలుపల వచ్చిన సీఎంకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనస్వాగతం పలికారు.

ఎట్టకేలకు బెయిల్.. జైలు నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ విడుదల.. ఘన స్వాగతం పలికి అభిమానులు..
Arvind Kejriwal
Balaraju Goud
|

Updated on: Sep 13, 2024 | 7:21 PM

Share

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 156 రోజుల తర్వాత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. తీహార్ జైలు వెలుపల వచ్చిన సీఎంకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. తీహార్ జైలు వెలుపల పార్టీ పెద్ద నాయకులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం సతీమణి సునీతా కేజ్రీవాల్‌, ఆమె కుమార్తె కూడా ఉన్నారు. కేజ్రీవాల్‌కు స్వాగతం పలికేందుకు పంజాబ్‌ సీఎం మాన్‌ కూడా తరలివచ్చారు. తీహార్ నుంచి సీఎం కేజ్రీవాల్ రోడ్ షో చేస్తూ ఆయన ఇంటికి వెళ్లారు.

10 లక్షల బాండ్‌పై శుక్రవారం(సెప్టెంబర్ 13) ఉదయం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ లభించింది. ఎక్సైజ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21న ఈడీ, జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది.

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. జీవితంలో చాలా కష్టపడ్డాను, చాలా కష్టాలను ఎదుర్కొన్నాను, కానీ దేవుడు నన్ను అడుగడుగునా ఆదుకున్నాడు. అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇచ్చారు. ప్రజల ప్రార్థనల వల్లే జైలు నుంచి బయటకు వచ్చానని కేజ్రీవాల్ అన్నారు. నా ధైర్యం 100 రెట్లు పెరిగింది. దేశాన్ని నిర్వీర్యం చేసేందుకు దేశ వ్యతిరేక శక్తులు పని చేస్తున్నాయి.. వారిపై పోరాడుతూనే ఉంటానన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..