Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: దేశ రాజధానిలో మరో దారుణం.. స్కూల్‌ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి.. సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్‌

యువకులిద్దరూ ముఖం కనిపించకుండా మాస్క్‌ వేసుకుని ఉన్నారు. అనంతరం యువకులిద్దరూ బైక్‌పై పరారయ్యారు. యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Delhi: దేశ రాజధానిలో మరో దారుణం.. స్కూల్‌ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి.. సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్‌
School Girl
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 14, 2022 | 3:37 PM

దేశ రాజధాని ఢిల్లీలో మరో క్రైం కేసు వెలుగు చూసింది. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఓ బాలికపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు. దాంతో 17 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. వెంటనే యువతిని ఆస్పత్రిలో చేర్పించగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ముఖంపై యాసిడ్‌ ఎక్కువగా పడటంతో కళ్లకు తీవ్రంగా గాయమైనట్టుగా యువతి తండ్రి తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను గుర్తించామని, వారిలో ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాలికను సఫ్దర్‌గంజ్ ఆసుపత్రిలో చేర్చారు. ఢిల్లీ పోలీసు బృందం కూడా ఆసుపత్రికి చేరుకుంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలలో యాసిడ్‌ ఎటాక్‌ దృశ్యాలు నమోదైంది.

ఉదయం 9 గంటల ప్రాంతంలో మోహన్ గార్డెన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు విద్యార్థులు స్కూల్‌కి వెళ్లేందుకు నిలబడి ఉండగా ముఖానికి ముసుగు ధరించి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు బాలికపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు స్థానికులు వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థిని వయస్సు 17 సంవత్సరాలు. ఆమె తన చెల్లెలితో కలిసి నిలబడి ఉంది. అంతలోనే బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఆమెపై యాసిడ్‌ విసిరారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అబ్బాయిలు బైక్‌పై వచ్చి విద్యార్థినిపై యాసిడ్‌ విసిరినట్లు ఫుటేజీలో కనిపిస్తోంది. యువకులిద్దరూ ముఖం కనిపించకుండా మాస్క్‌ వేసుకుని ఉన్నారు. అనంతరం యువకులిద్దరూ బైక్‌పై పరారయ్యారు. యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. విద్యార్థిని పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్‌ దృష్టి సారించింది. ద్వారకా మోడ్ సమీపంలో ఓ పాఠశాల విద్యార్థినిపై యాసిడ్ పోశారని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. బాధితురాలికి అండగా ఉంటామని చెప్పారు. దేశంలో యాసిడ్‌ను నిషేధించాలని ఢిల్లీ మహిళా కమిషన్ ఏళ్ల తరబడి పోరాడుతోంది. కూరగాయల మాదిరిగానే మార్కెట్‌లో యాసిడ్ సులభంగా దొరుకుతుందని, దాని రిటైల్ అమ్మకాలను ప్రభుత్వం ఎందుకు నిషేధించడం లేదని ప్రశ్నించారు. అలాగే ఢిల్లీ మహిళా కమిటీ కూడా చాలా ఏళ్లుగా యాసిడ్ నిషేధం కోసం పట్టుబడుతోంది. అయితే ప్రభుత్వాలు ఎప్పుడు మేల్కొంటాయని ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాగునీటిలో చిటికెడు ఉప్పు కలిపి చూడండి..! మిరాకిల్ జరగుతుంది..!
తాగునీటిలో చిటికెడు ఉప్పు కలిపి చూడండి..! మిరాకిల్ జరగుతుంది..!
వక్ఫ్‌ బిల్లుపై వాడివేడిగా చర్చ.. మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు
వక్ఫ్‌ బిల్లుపై వాడివేడిగా చర్చ.. మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు
నవమిరోజున ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి రామయ్య ఆశీస్సులు మీసొంతం
నవమిరోజున ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి రామయ్య ఆశీస్సులు మీసొంతం
Virat Kohli: కోహ్లీకి చెప్పి మరీ వికెట్ తీసిన దమ్మున్నోడు
Virat Kohli: కోహ్లీకి చెప్పి మరీ వికెట్ తీసిన దమ్మున్నోడు
జపాన్‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.2 నమోదు!
జపాన్‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.2 నమోదు!
నటి సమంత కోసం గుడి కట్టిన తెలుగు అభిమాని..
నటి సమంత కోసం గుడి కట్టిన తెలుగు అభిమాని..
ఆ మూవీని రిలీజ్ చేయద్దు.. శివసేన హెచ్చరిక..ఇంతకీ ఏముందీ సినిమాలో?
ఆ మూవీని రిలీజ్ చేయద్దు.. శివసేన హెచ్చరిక..ఇంతకీ ఏముందీ సినిమాలో?
సింక్ డ్రెయిన్ శుభ్రం చేయడానికి బెస్ట్ క్లీనింగ్ టిప్స్..!
సింక్ డ్రెయిన్ శుభ్రం చేయడానికి బెస్ట్ క్లీనింగ్ టిప్స్..!
ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్.. 2 జట్లతో ఏకంగా 12 మ్యాచ్‌లు
ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్.. 2 జట్లతో ఏకంగా 12 మ్యాచ్‌లు
మెట్లు ఎక్కేటప్పుడు కీళ్ల నొప్పులు వస్తున్నాయా.. నిపుణులు సలహా
మెట్లు ఎక్కేటప్పుడు కీళ్ల నొప్పులు వస్తున్నాయా.. నిపుణులు సలహా