AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జేఎన్‌యూలో దీపికా పదుకొనే..

దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే పర్యటించారు. ఆదివారం యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్ధులపై.. గుర్తు తెలియన వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. విద్యార్థులకు మద్దతు తెల్పుతూ దీపిక జేఎన్‌యూకి వెళ్లారు. దుండగుడల దాడిలో గాయపడిన విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని పరామర్శించారు. దాడి జరిగిన తీరుపై.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన నిరసనలో పాల్గొని విద్యార్థులకు అండగా […]

జేఎన్‌యూలో దీపికా పదుకొనే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 08, 2020 | 2:01 AM

Share

దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే పర్యటించారు. ఆదివారం యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్ధులపై.. గుర్తు తెలియన వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. విద్యార్థులకు మద్దతు తెల్పుతూ దీపిక జేఎన్‌యూకి వెళ్లారు. దుండగుడల దాడిలో గాయపడిన విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని పరామర్శించారు. దాడి జరిగిన తీరుపై.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన నిరసనలో పాల్గొని విద్యార్థులకు అండగా నిలబడ్డారు.

కాగా, ఆదివారం సాయంత్రం.. మాస్క్‌ ధరించి వచ్చిన కొంతమంది దుండగులు రాడ్లు, యాసిడ్, పదునైన ఆయుధాలతో విద్యార్థులు, టీచర్లపై దాడి చేశారు. దాదాపు రెండు గంటల పాటు యూనివర్సిటీ క్యాంపస్‌లో రణరంగం సృష్టించారు. ఈ దాడిలో జేఎన్‌యూ ఎస్‌యూ అధ్యక్షురాలు ఐషే ఘోష్ సహా మరో 30 మంది విద్యార్థులు, టీచర్లు తీవ్రంగా గాయపడ్డారు.