AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన వరంగల్ కుర్రాడు.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..

Arjun Erigaisi Bronze Medal: వరంగల్ కుర్రాడు అర్జున్ ఇరిగేసి చదరంగంలో మరో మెట్టు ఎక్కాడు. దోహా వేదికగా ముగిసిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నీలో కాంస్య పతకం సాధించి భారత ఖ్యాతిని చాటారు. ముఖ్యంగా వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు గట్టి పోటీనిస్తూ పోడియం ఫినిష్ సాధించడం విశేషం. అర్జున్ పట్టుదలను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.

PM Modi: చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన వరంగల్ కుర్రాడు.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..
Arjun Erigaisi
Venkata Chari
|

Updated on: Dec 31, 2025 | 11:55 AM

Share

Arjun Erigaisi Bronze Medal: ఖతార్ రాజధాని దోహాలో జరిగిన 2025 ఫిడే (FIDE) ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అర్జున్ ఇరిగేసి అద్భుత ప్రదర్శన కనబరిచారు. మొత్తం 13 రౌండ్ల పాటు సాగిన ఈ పోరులో అర్జున్ 9.5 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. తద్వారా ఈ టోర్నీలో పతకం సాధించిన రెండో భారతీయ పురుష ప్లేయర్‌గా చరిత్ర సృష్టించారు. గతంలో విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే ఈ ఘనత సాధించారు.

ప్రధాని మోదీ అభినందనలు..

అర్జున్ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. “దోహాలో జరిగిన ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన అర్జున్ ఇరిగేసిని చూసి గర్విస్తున్నాను. అతని పట్టుదల, కృషి ప్రశంసనీయం. భవిష్యత్తులో అతను మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను,” అని మోదీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: 21 ఫోర్లు, 10 సిక్సర్లు.. ప్రపంచ కప్‌ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. దిమ్మతిరిగే రికార్డ్ ఎవరిదంటే?

ఇవి కూడా చదవండి

కార్ల్‌సన్‌కు షాకిస్తూ..: ఈ టోర్నీలో అర్జున్ ఆట తీరు అందరినీ ఆకట్టుకుంది. ప్రపంచ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌ను సైతం ఓడించి తన సత్తా చాటాడు. ఒక దశలో స్వర్ణ పతకం రేసులో నిలిచినప్పటికీ, చివరి రౌండ్ల ఫలితాల ఆధారంగా కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఓపెన్ విభాగంలో మాగ్నస్ కార్ల్‌సన్ స్వర్ణం గెలవగా, వ్లాదిస్లావ్ ఆర్టెమివ్ రజతం సాధించారు.

కోనేరు హంపికి కూడా కాంస్యం..

అర్జున్‌తో పాటు మహిళల విభాగంలో భారత స్టార్ క్రీడాకారిణి, తెలుగు తేజం కోనేరు హంపి కూడా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. హంపి విజయాన్ని కూడా ప్రధాని ప్రత్యేకంగా కొనియాడారు. భారత చెస్ చరిత్రలో ఇద్దరు తెలుగు వారు ఒకే అంతర్జాతీయ వేదికపై పతకాలు సాధించడం గమనార్హం.

ఇది కూడా చదవండి: Video: W,W,W,W,W,W,W,W.. టీ20 క్రికెట్‌లోనే ఊహించని విధ్వంసం.. 7 పరుగులు, 8 వికెట్లతో డేంజరస్ బౌలింగ్..

అర్జున్ ప్రస్థానం..

తెలంగాణలోని వరంగల్‌కు చెందిన అర్జున్ ఇరిగేసి 14 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు. ఇటీవల ఆయన 2800 లైవ్ రేటింగ్ మార్కును దాటి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి చేరుకున్నారు. ఈ విజయంతో ప్రపంచ చదరంగంలో అర్జున్ తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారని మరోసారి రుజువైంది.

వచ్చే ఏడాది జరగబోయే వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఈ విజయం అర్జున్‌కు గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.