నేడు విజయ దివాస్.. పాక్‌పై భారత్ ఘన విజయం.. 93వేల మంది పాక్ సైనికులు శరణు కోరిన వేళ..

భారత్-పాక్.. దాయాది దేశాల వైరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్-పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం యావత్..

నేడు విజయ దివాస్.. పాక్‌పై భారత్ ఘన విజయం.. 93వేల మంది పాక్ సైనికులు శరణు కోరిన వేళ..
Follow us

|

Updated on: Dec 16, 2020 | 12:31 PM

భారత్-పాక్.. దాయాది దేశాల వైరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్-పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా స్వాతంత్ర్యం అనంతరం మొదలు ఇప్పటికీ భారత్ – పాకిస్తాన్ మధ్య వైరం పెరుగుతూనే ఉందే తప్ప ఇసుమంతైనా తగ్గలేదు. అయితే భారత్ శాంతిమార్గాన్ని అవలంభిస్తుండగా, కయ్యానికి కాలు దువ్వడమే పనిగా పెట్టుకుంది పాకిస్తాన్. భారత్ శాంతి మార్గమే పాటిస్తున్నా.. తనదాకా వస్తే మాత్రం తోలుతీస్తానంటూ పాకిస్తాన్‌ను హెచ్చరిస్తుంది. అలా ఎన్నోసార్లు చేసింది కూడా. నిత్యం పగతో రగిలిపోయే పాకిస్తాన్ భద్రతా బలగాలు.. భారత్‌పై ఎన్నోసార్లు దాడులు చేశాయి. మరి భారత బలగాలు ఊరుకుంటాయా?. దాడులకు ప్రతిగా ధీటైన సమాధానం ఇస్తూ తరిమి తరిమి కొట్టారు. అలాంటి యద్ధాల్లో 1971 యుద్దం గొప్పదని చెప్పాలి. 1971 డిసెంబర్ 03వ తేదీన భారత్-పాక్ మధ్య ప్రారంభమైన ఈ యుద్ధం.. డిసెంబర్ 16వ తేదీన భారత్‌ ఎదుట 93వేల మంది పాకిస్తాన్ సైనికుల లొంగుబాటుతో ముగిసింది. అంతటి ఘన విజయానికి నేటికి 49 సంవత్సారలు పూర్తయ్యింది. ఆ ఘన విజయానికి స్మారకంగానే ప్రతి ఏటా డిసెంబర్ 16న విజయ్ దివాస్‌ను భారత ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తోంది. మరి ఆ యుద్ధ విజయ ప్రస్థానాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుందాం.

యుద్ధానికి కారణం ఇదే..

భారత-పాక్ మధ్య యుద్ధం బంగ్లాదేశ్ విముక్తి పోరాటం వల్ల జరిగింది. తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తానీయుల మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో బంగ్లాదేశ్ విముక్తి పోరాటం ప్రారంభమైంది. 1970లో పాకిస్తాన్ ఎన్నికల తరువాత ఈ పోరాటం మరింత ఉధృతమైంది. 1971 మార్చి 27న, జియావుర్ రహ్మాన్‌.. బంగ్లాదేశ్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించాడు. సరిగ్గా అదే రోజున అప్పటి భారతదేశ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ స్వాతంత్ర్యపోరాటానికి పూర్తి మద్దతు ప్రకటించారు. అయితే అప్పటికే నాటి బంగ్లాదేశ్(ఢాకా), బెంగాల్ సరిహద్దుల్లో రక్తపుటేరులు పారుతున్నాయి. దీంతో పాకిస్తాన్‌‌పై సాయుధ చర్య చేపట్టడమే కరెక్ట్ అని భావించిన ప్రధాని ఇందిరా గాంధీ.. ఆ దిశగా చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో సరిహద్దుల వెంబడి భారీగా భారత బలగాలను మోహరింపజేశారు. అయితే నవంబరు 23 న యాహ్యా ఖాన్ పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజలందరినీ యుద్ధానికి సిద్ధమవమని పిలుపు ఇచ్చాడు. ఈ క్రమంలో డిసెంబరు 3 తేదీన భారత్‌కు చెందిన ఎనిమిది వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ వైమానిక దళాలు దాడులు జరిపాయి. దీనికి ఆగ్రహించిన భారత్.. పాక్‌పై యుద్ధాన్ని ప్రకటించింది. ఈ పిలుపుతో పాక్ సైన్యంపై ఇండియన్ ఆర్మీ విరుచుకుపడింది.

విరుచుకుపడిన ఇండియన్ ఆర్మీ..

1971 డిసెంబరు 8 తేదీన స్క్యాడ్రన్ లీడర్ ఆర్ఎన్ భరద్వాజ్, ఫ్లయింగ్ ఆఫీసర్ వీకే హెబ్లే, బీసీ కరంబయా, లెఫ్టినెంట్ ఏఎల్ దేవ్‌స్కార్‌లు పాకిస్థాన్‌లోని మురిద్ వైమానిక స్థావరాలపై మిగ్ 19సి విమానాలతో బాంబుల వర్షం కురిపించారు. సరిహద్దుల నుంచి పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురిద్ వైమానిక స్థావరంపై దాడి చేసి చాకచక్యంగా వెనుదిరిగారు. మరోవైపు పదాతిదళాలు సైతం విరుచుకుపడ్డాయి. యుద్ధ ట్యాంకర్లతో బాంబుల వర్షం కురిపించాయి. పాక్ సైన్యం వ్యూహాలను చిత్తు చేస్తూ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయాయి. నావికాదళం కూడా పాకిస్తాన్‌పై విరుచుకుపడింది. పాకిస్తాన్ నివాకాదళాన్ని ముప్పుతిప్పలు పెట్టారు. అలా పాకిస్తాన్ సైన్యాన్ని ఇండియన్ ఆర్మీ హడలెత్తించింది. మొత్తంగా 13 రోజుల పాటు భారత్-పాకిస్తాన్ బలగాలు తూర్పు, పశ్చిమ దిశలలో యుద్ధం చేశాయి. అయితే భారత బలగాల ధాటికి తట్టుకోలేక తూర్పు కమాండ్‌కు చెందిన పాకిస్తానీ సైనిక బలగాలు భారత్‌కు లొంగిపోయాయి. 1971, డిసెంబర్ 16వ తేదీన 93,000 వేల మంది పాకిస్తానీ సైనికులు తమ లొంగుబాటును ప్రకటించారు. ఆ మేరకు లొంగుబాటు పత్రంపై సంతకాలు చేశారు. దీంతో భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం పరిసమాప్తం అవగా.. ఘన విజయం సాధించిన భారత్ యుద్ధ క్షేత్రంలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. బంగ్లాదేశ్‌కు స్వాంత్రత్యాన్ని సిద్ధించి పెట్టింది.

ప్రపంచ యుద్ధాల్లోనే చారిత్రాత్మకం..

1971, డిసెంబర్ 16న జయకేతనం ఎగురవేసిన భారత్.. దాదాపు 93,000 మంది పశ్చిమ పాకీస్తానీ వాసులను యుద్ధ ఖైదీలుగా అదుపులోకి తీసుకుంది. అయితే జెనీవా ఒప్పందం ప్రకారం సదరు యుద్ధ ఖైదీలందరినీ పాకిస్తాన్‌కు భారత్ తిరిగి అప్పగించేసింది. ఇదే సమయంలో 54 మంది భారత జవాన్లను పాకిస్తాన్ యుద్ధ ఖైదీలుగా బందించింది. వారిని ఇప్పటికీ భారత్‌కు అప్పగించలేదు. పైగా వారు తమ బందీలుగా లేరంటూ ప్రకటిస్తూ వస్తోంది. దీంతో వారి ఉనికి ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఇదిలాఉంటే. ఒక యుద్ధంలో భారీ సంఖ్యలో సైనికులు బహిరంగంగా లొంగిపోవడం ప్రపంచ యుద్ధ చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచిపోయింది. ఇక 1971 డిసెంబర్ 16 లొంగుబాటు తరువాత తూర్పు పాకిస్తాన్ కాస్తా, స్వతంత్ర బంగ్లాదేశ్‌గా విడిపోయింది. ఇంతటి ఘన విజయం సాధించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఏటా డిసెంబర్ 16వ తేదీన విజయ దివాస్‌ను నిర్వహిస్తోంది. ఈ యుద్ధంలో పోరాడి అమరులైన జవాన్లను స్మరించుకుంటూ వారి త్యాగాలకు యావత్ భారత్ సెల్యూట్ చేస్తోంది.

Latest Articles
యాంగ్జైటీ ఎటాక్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
యాంగ్జైటీ ఎటాక్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
అమ్మ బాబోయ్ అరాచకం.! దివి వయ్యారాలు కుర్ర హృదయాలకు హార్ట్ ఎటాక్
అమ్మ బాబోయ్ అరాచకం.! దివి వయ్యారాలు కుర్ర హృదయాలకు హార్ట్ ఎటాక్
ఎట్టకేలకు చిక్కిన సీరియల్ కిల్లర్.. హత్యల లిస్టుతో పోలీసుల షాక్!
ఎట్టకేలకు చిక్కిన సీరియల్ కిల్లర్.. హత్యల లిస్టుతో పోలీసుల షాక్!
ఇంట్లో గడియారాన్ని ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసా?
ఇంట్లో గడియారాన్ని ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసా?
పైకేమో చూస్తే అదొక టిఫిన్ సెంటర్.. కానీ లోపల జరిగేది తెలిస్తే!
పైకేమో చూస్తే అదొక టిఫిన్ సెంటర్.. కానీ లోపల జరిగేది తెలిస్తే!
T20 ప్రపంచకప్‌ కోసం సూర్య సన్నాహాలు.. మధ్యాహ్నం గ్రౌండ్‌కు వెళ్లి
T20 ప్రపంచకప్‌ కోసం సూర్య సన్నాహాలు.. మధ్యాహ్నం గ్రౌండ్‌కు వెళ్లి
అరే ఏంట్రా ఇది.. యంగ్ హీరో బాడీ మీద ఇలాంటి గేమ్సా.. ?
అరే ఏంట్రా ఇది.. యంగ్ హీరో బాడీ మీద ఇలాంటి గేమ్సా.. ?
'ఇక ప్రతి సోమవారం నలిగిన బట్టలు మాత్రమే ధరించండి..' CSIR హుకూం!
'ఇక ప్రతి సోమవారం నలిగిన బట్టలు మాత్రమే ధరించండి..' CSIR హుకూం!
సమ్మోహనంగా సాగిన సంస్కృత కవి సమ్మేళనం
సమ్మోహనంగా సాగిన సంస్కృత కవి సమ్మేళనం
బ్యాటింగ్‌లో బాహుబలి.. బౌలింగ్‌లో భల్లాలదేవ.. ఈ ప్లేయర్ అరవీర.!
బ్యాటింగ్‌లో బాహుబలి.. బౌలింగ్‌లో భల్లాలదేవ.. ఈ ప్లేయర్ అరవీర.!