AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Corona: గుడ్‌న్యూస్.. దేశంలో రికార్డు స్థాయిలో తగ్గిన కరోనా కేసులు.. 534 రోజుల తర్వాత భారీగా పతనం..

India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ ఒక్కసారిగా

India Corona: గుడ్‌న్యూస్.. దేశంలో రికార్డు స్థాయిలో తగ్గిన కరోనా కేసులు.. 534 రోజుల తర్వాత భారీగా పతనం..
India Corona
Shaik Madar Saheb
|

Updated on: Nov 22, 2021 | 12:25 PM

Share

India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ ఒక్కసారిగా పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసుల సంఖ్య తగ్గింది. నిన్న ఆదివారం దేశవ్యాప్తంగా 8,488 కేసులు నమోదయ్యాయి. 534 రోజుల తర్వాత కేసుల సంఖ్య భారీగా పతనమైనట్లు కేంద్రం వెల్లడించింది. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 249 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా నిన్న నిన్న నమోదైన కేసులు, మరణాల్లో కేరళలోనే ఎక్కువగా నమోదయ్యాయి. కేరళలో నిన్న 5080 కేసులు నమోదుకాగా.. 40 మంది మరణించారు.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,18,443 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 534 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.30 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,18,901 కి చేరగా.. మరణాల సంఖ్య 4,65,911 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా నిన్న కరోనా నుంచి 12,510 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,39,34,547 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 116.87 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇదిలాఉంటే.. దేశంలో ఇప్పటివరకు 63,25,24,259 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. నిన్న దేశవ్యాప్తంగా 7,83,567 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది.

Also Read:

Viral Video: కోతికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.. కానీ వానరం ఏం చేసిందో చూస్తే షాకే.. వీడియో వైరల్