AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 4th Wave: దేశంలో కరోనా విలయం.. మళ్లీ పెరిగిన కేసులు, మరణాలు.. నిన్న ఎన్నంటే..?

దాదాపు మూడు నెలల అనంతరం కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. వైద్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ప్రభావం అంతగా లేనప్పటికీ.. జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు.

Covid 4th Wave: దేశంలో కరోనా విలయం.. మళ్లీ పెరిగిన కేసులు, మరణాలు.. నిన్న ఎన్నంటే..?
India Corona
Shaik Madar Saheb
|

Updated on: Jun 10, 2022 | 9:39 AM

Share

Coronavirus 4th wave in India: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు.. మళ్లీ పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు మూడు నెలల అనంతరం కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. వైద్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ప్రభావం అంతగా లేనప్పటికీ.. జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. కాగా.. గత 24 గంటల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గురువారం 7,584 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే కేసుల సంఖ్య 344 పెరిగింది. దీంతోపాటు ఈ మహమ్మారి (Coronavirus) కారణంగా దేశవ్యాప్తంగా 24 మంది మరణించారు. నిన్నటితో పోల్చుకుంటే.. దేశవ్యాప్తంగా 16 పెరిగాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దాదాపు మూడు నెలల తర్వాత రోజువారీ కేసుల సంఖ్య 7 వేల మార్క్ దాటడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 36,267 కి పెరిగినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.08 శాతం ఉన్నాయి. గత 24 గంటల్లో దేశంలో మొత్తం 3,791 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ రేటు దాదాపు 98.70 శాతంగా ఉంది.

ఇవి కూడా చదవండి
  • దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య – 4,32,05,106
  • కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య – 4,26,44,092
  • దేశంలో మరణాల సంఖ్య 5,24,747 కి చేరింది.

ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 194.76 కోట్ల డోసులను పంపిణీ చేశారు. నిన్న 15,31,510 మందికి టీకాలు ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..