AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 4th Wave: భారత్‌లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు.. గత 24 గంటల్లో ఎన్ని నమోదయ్యాయంటే..?

దేశవ్యాప్తంగా 14,506 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 30 మంది మరణించారు. నిన్నటి పోల్చుకుంటే కేసుల సంఖ్య 2,717 కేసులు, 3 మరణాలు పెరిగాయి.

Covid 4th Wave: భారత్‌లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు.. గత 24 గంటల్లో ఎన్ని నమోదయ్యాయంటే..?
Coronavirus Cases
Shaik Madar Saheb
|

Updated on: Jun 29, 2022 | 9:41 AM

Share

India Covid-19 Updates: భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కోవిడ్ కేసుల సంఖ్య.. మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. గత 24 గంటల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. తాజాగా 14 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మంగళవారం దేశవ్యాప్తంగా 14,506 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 30 మంది మరణించారు. నిన్నటి పోల్చుకుంటే కేసుల సంఖ్య 2,717 కేసులు, 3 మరణాలు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 96,602 (0.23 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో పాజిటివిటీ రేటు 3.35 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.56 శాతం ఉంది.

దేశంలో నమోదైన కరోనా గణాంకాలు..

ఇవి కూడా చదవండి

దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,34,33,345 కి పెరిగింది. కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,25,077 కి చేరింది. నిన్న కరోనా నుంచి 11,574 మంది బాధితులు కోలుకున్నారు. కోలుకున్న వారి సంఖ్య 4,28,08,666 కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 197,46 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. నిన్న 13,44,788 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..