AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Corona: ఆ రాష్ట్రంలోనే ఎక్కువ కరోనా కేసులు.. దేశంలో ఎన్ని యాక్టివ్‌గా ఉన్నాయంటే..

దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మే 27 ఉదయం వరకు 1,009 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళ రాష్ట్రంలో అత్యధికంగా కరోనావైరస్ సోకిన వ్యక్తులు ఉన్నారు. దక్షిణాసియా దేశాలలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరిగింది. దీంతో భారతదేశంలో కూడా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

India Corona: ఆ రాష్ట్రంలోనే ఎక్కువ కరోనా కేసులు.. దేశంలో ఎన్ని యాక్టివ్‌గా ఉన్నాయంటే..
India Coronavirus Cases
Shaik Madar Saheb
|

Updated on: May 29, 2025 | 8:23 AM

Share

దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మే 27 ఉదయం వరకు 1,009 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళ రాష్ట్రంలో అత్యధికంగా కరోనావైరస్ సోకిన వ్యక్తులు ఉన్నారు. దక్షిణాసియా దేశాలలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరిగింది. దీంతో భారతదేశంలో కూడా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. భారతదేశంలో కరోనా వేరియంట్లు NB.1.8.1, LF.7 గుర్తించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

భారతదేశంలో COVID-19 కేసుల వివరాలు..

భారత్ లో 1009 కోవిడ్ 19 యాక్టివ్ కేసులున్నాయని.. ఇటీవల 752 కేసులు నిర్ధారించినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళలో అత్యధికంగా 430 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. తరువాత మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, కర్ణాటకలో 47, గుజరాత్‌లో 83 కేసులు, కర్ణాటకలో 47 మంది, ఉత్తరప్రదేశ్‌లో 15 మంది, పశ్చిమ బెంగాల్‌లో 12 మంది, తమిళనాడులో 69 మంది, రాజస్థాన్‌లో 13 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. తెలంగాణలో ఒకటి, ఏపీలో 4 కొవిడ్‌ కేసులు నమోదు అయ్యాయి.

ఇప్పటివరకు ఏడుగురు మరణించారు. అండమాన్ – నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వంటి కొన్ని రాష్ట్రాలలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు నివేదించలేదని ప్రకటనలో తెలిపింది.

దేశంలో COVID-19 కేసులు పెరగడంతో మరోసారి ఆందోళన మొదలైంది. అయితే, తేలికపాటి, సూక్ష్మ లక్షణాలతోనే కేసులు నమోదవుతున్నాయని.. కోవిడ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.

భారతదేశంలో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య ప్రస్తుతం స్వల్పంగా పెరుగుతోందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ రాజీవ్ బెహ్ల్ అన్నారు. గతంలో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ప్రస్తుత కరోనావైరస్ వ్యాప్తి తీవ్రమైనది కాదని.. ఇంట్లో చికిత్స పొందవచ్చని చెప్పింది. ఈ రకమైన కరోనా ఇన్ఫెక్షన్‌ను చురుగ్గా పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..