Rahul Gandhi: రాహుల్ కు సంఘీభావంగా నేడు కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్షలు.. పాల్గొననున్న సోనియా, ప్రియాంక

|

Mar 26, 2023 | 9:47 AM

ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో జరిగే నిరసన దీక్షలో రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు కాంగ్రెస్‌ అగ్రనేతలు పాల్గొననున్నారు.

Rahul Gandhi: రాహుల్ కు సంఘీభావంగా నేడు కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్షలు.. పాల్గొననున్న సోనియా, ప్రియాంక
Sonia, Priyanka, Rahul
Follow us on

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఇవాళ (మార్చి26) దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్షలు చేపట్టనుంది. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో జరిగే నిరసన దీక్షలో రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు కాంగ్రెస్‌ అగ్రనేతలు పాల్గొననున్నారు. అలాగే టీపీసీసీ అధ్యక్షుడు గాంధీ భవన్‌లో దీక్ష చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ దీక్ష జరగనుంది. పరువు నష్టం కేసులో శిక్షపడి, ఎంపీగా అనర్హతను ఎదుర్కొంటున్న రాహుల్‌ గాంధీకి సంఘీభావంగా ఈ దీక్షలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్‌ అధిష్టానం తెలిపింది. అన్ని రాష్ట్రాలు, జిల్లా కేంద్రాలలో గాంధీ విగ్రహాల ఎదుట ఈ నిరసన చేపట్టాలని పిలుపునిచ్చింది.

కాంగ్రెస్‌లోకి డీఎస్‌ శ్రీనివాస్‌..

కాగా బీఆర్ఎస్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ ఈరోజు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ రోజు ఉదయం గాంధీభవన్ లో ఏఐసీసీ ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. అలాగే గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టే దీక్షలో డీఎస్‌ పాల్గొననున్నారు. డీఎస్ తో పాటు మాజీ మేయర్ డి.సంజయ్‌ కాంగ్రెస్ లో చేరనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం  క్లిక్ చేయండి..