AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prashant Kishor: సోనియా గాంధీతో నాలుగోవసారి ప్రశాంత్ కిశోర్ భేటీ.. కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైందా..?

గత మూడు రోజుల్లో కాంగ్రెస్ మూడు సమావేశాలు నిర్వహించింది. అదే సమయంలో ఈరోజు మళ్లీ నాలుగో సమావేశం జరగనుంది.

Prashant Kishor: సోనియా గాంధీతో నాలుగోవసారి ప్రశాంత్ కిశోర్ భేటీ..  కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైందా..?
Onia Gandhi, Prashant Kishor
Balaraju Goud
|

Updated on: Apr 20, 2022 | 1:33 PM

Share

Prashant Kishor meet Sonia Gandhi: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరతారా, 2024 జాతీయ ఎన్నికల్లో ఆయన పాత్ర ఏమిటో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయిస్తారని పార్టీ నేత ఒకరు తెలిపారు. సోనియా గాంధీ మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమైంది. పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఈసారి సోనియా గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే గత మూడు రోజుల్లో కాంగ్రెస్ హైకమాండ్ 3 సమావేశాలు నిర్వహించారు. అదే సమయంలో కాంగ్రెస్ ఈరోజు మరోసారి సమావేశం కానుంది. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా పాలుపంచుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటి పేర్లతో ఎన్నికల విజయాల అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న ప్రశాంత్ కిషోర్ తన సోనియా, రాహుల్ గాంధీల ముందు ఉంచారు.

రానున్న కాలంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలైంది. ఈ 5 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలోనూ ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఓటమి గురించి, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలపై ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు.

ఈ నేపథ్యంలోనే గత మూడు రోజుల్లో కాంగ్రెస్ మూడు సమావేశాలు నిర్వహించింది. అదే సమయంలో ఈరోజు మళ్లీ నాలుగో సమావేశం జరగనుంది. ఇందులో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు ప్రశాంత్ కిషోర్ కూడా పాలుపంచుకోనున్నారు. దీనితో పాటు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు కూడా సమావేశానికి హాజరు కావచ్చని తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ త్వరలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం. దీనిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవచ్చు.

ఇదిలావుంటే, 5 రాష్ట్రాల శాసన సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ నిరంతర సమీక్షలో నిమగ్నమైంది. దీంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల వ్యూహంపై చ‌ర్చ జ‌రుగుతోంది. అటువంటి పరిస్థితిలో, వచ్చే లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై ప్రశాంత్ కిషోర్ రెండు రోజుల క్రితం కాంగ్రెస్ హైకమాండ్ ముందు ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. మరోవైపు, ప్రశాంత్ కిషోర్ ప్లాన్‌పై చర్చించి, వారంలోపు సోనియాగాంధీని తిరిగి సంప్రదించే బాధ్యతను కాంగ్రెస్ ప్యానెల్‌కు అప్పగించారు. ఈ సమావేశాలు రాబోయే కొద్ది రోజుల పాటు కొనసాగుతాయని, పార్టీ తన మేధోమథన సెషన్‌తో పాటు ప్రశాంత్ కిషోర్ ఎంట్రీని త్వరలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ ఏడాది చివరి నాటికి హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ప్రశాంత్ కిషోర్ ప్లాన్ ఫోకస్ చేస్తోంది. సిఫార్సులలో బూత్ స్థాయిలో WhatsApp సమూహాలు ఉన్నాయి. కమ్యూనికేషన్ బృందాలు, ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలాలు, బలహీనతలు, సాధ్యమయ్యే అభ్యర్థులు, స్థానిక సమస్యలు, గ్రాన్యులర్ డేటా విశ్లేషణ, అధిక ధరలతో సహా రోజువారీ ప్రాతిపదికన ప్రజలను ప్రభావితం చేసే సమస్యలపై పీకే బృందం సర్వే నిర్వహిస్తోంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే రంగంలోకి దిగింది పీకే టీమ్. దీన్ని బట్టి చూస్తే.. త్వరలోనే కాంగ్రెస్‌తో ప్రశాంత్ కిశోర్ జత కట్టడం ఖాయమైపోయింది.

Read Also….  Paritala Sriram: సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కొట్టిస్తారా.. కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేదీలేదుః పరిటాల శ్రీరామ్