AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీకే మద్ధతిచ్చేలా ప్రచారానికి సిద్ధం

వచ్చే నెలలో కర్నాటకలోని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ రాష్ట్ర సమితి అధినేత సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.

CM KCR: సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీకే మద్ధతిచ్చేలా ప్రచారానికి సిద్ధం
CM KCR
Aravind B
|

Updated on: Apr 11, 2023 | 8:03 AM

Share

వచ్చే నెలలో కర్నాటకలోని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ రాష్ట్ర సమితి అధినేత సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి వెల్లడించారు. ఈసారి కర్ణాటక ఎన్నికల్లో 59 స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి అవుతానని కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు.

అయితే కాంగ్రెస్‌, బీజేపీలో ఎవరితో పొత్తు పెట్టుకుంటారని విలేకరులు ప్రశ్నించగా..తాము ఏ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేది ముందుగా చెప్పలేమని కుమారస్వామి స్పష్టం చేశారు. జేడీఎస్ ఇప్పటికే 97 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించగా, కాంగ్రెస్ 165 మంది పేర్లను ప్రకటించింది. బీజేపీ అభ్యర్థుల జాబితాను ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా కర్ణాటకలో మే 10 న ఎన్నికలు నిర్వహించున్నారు. మే 13 న ఓట్ల లెక్కింపు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..