AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శాంతికైనా, యుధ్ధానికైనా సిధ్దం ! చైనా

భారత-చైనా సరిహద్దు సమస్యపై ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిధ్ధంగా ఉన్నామంటూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటులో చేసిన ప్రకటనపై చైనా స్పందిస్తూ.. శాంతి కైనా, వార్ కైనా తాము రెడీ అన్ని ప్రకటించింది. ఈ మేరకు అధికార..

శాంతికైనా, యుధ్ధానికైనా సిధ్దం ! చైనా
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 16, 2020 | 6:32 PM

Share

భారత-చైనా సరిహద్దు సమస్యపై ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిధ్ధంగా ఉన్నామంటూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటులో చేసిన ప్రకటనపై చైనా స్పందిస్తూ.. శాంతి కైనా, వార్ కైనా తాము రెడీ అన్ని ప్రకటించింది. ఈ మేరకు అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ లో ఓ ఆర్టికల్ ప్రచురితమైంది. బోర్డర్ లో ఉద్రిక్త పరిస్థితికి భారత సైన్యమే కారణమని ఇందులో ఆరోపించారు. తాము సంయమనంతో ఉన్నప్పటికీ లడాఖ్ నియంత్రణ రేఖ వద్ద తమ సైనికులను భారత జవాన్లు రెచ్ఛగొడుతున్నారని, ఇదే విషయాన్ని తాము పలుమార్లు వివిధ స్థాయుల్లో జరిగిన చర్చల సందర్భంగా భారత అధికారులకు స్పష్టం చేశామని చైనా పేర్కొంది. ఏమైనా..మేము శాంతి కైనా, యుధ్ధానికైనా రెడీ అని వెల్లడించింది.