AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: మెరుపు వేగంతో దూసుకొచ్చిన కారు.. ఇద్దరు మహిళా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు బలి.. మృతుల్లో ఏపీ వాసి

ఈ ఘటనలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మృతిచెందారు. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆఫీస్‌ ముగిసిన తర్వాత.. వారు ఇంటికి వెళ్తుండగా

Road Accident: మెరుపు వేగంతో దూసుకొచ్చిన కారు.. ఇద్దరు మహిళా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు బలి.. మృతుల్లో ఏపీ వాసి
Chennai Road Accident
Jyothi Gadda
|

Updated on: Sep 16, 2022 | 10:01 AM

Share

Road Accident: డ్యూటీ ముగించుకుని ఇంటికి బయల్దేరిన ఇద్దరూ యువతుల్ని వేగంగా వచ్చిన కారు బలితీసుకుంది. తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు దుర్మరణం చెందారు. చెన్నైలో గురువారం రాత్రి జరిగింది ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నైలోని ఐటీ కారిడార్‌లో రోడ్డు దాటుతుండగా ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మృతిచెందారు. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆఫీస్‌ ముగిసిన తర్వాత.. వారు ఇంటికి వెళ్తుండగా చెన్నైలోని ఓఎంఆర్‌ వద్ద వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్పాట్‌లోనే ఓ యువతి మృతిచెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో యువతి ప్రాణాలు కోల్పోయింది.

ఇక, మృతి చెందిన యువతులు..ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన ఎస్‌.లావణ్య (24), కేరళలోని పాలక్కడ్‌కు చెందిన ఆర్‌. శ్రీలక్ష్మీ (23)గా గుర్తించారు. వీరిద్దరూ హెచ్‌సీఎల్‌ స్టేట్‌ స్ట్రీట్‌ సర్వీస్‌లో ఎనలిస్ట్‌లుగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 130 కి.మీల వేగంతో ఉందని వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి