AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతి ప్రమాదకరమైన చోట దిగిన విక్రమ్ ల్యాండర్.?

చంద్రుడి దక్షిణ ధృవంపై అత్యంత సంక్లిష్ట పరిస్థితులు ఉంటాయని యూరోపియన్ అంతరిక్ష సంస్థ పేర్కొంది. ఆ ప్రాంతంలో ల్యాండ్ చేయడం చాలా ప్రమాదకరమని చెప్పింది. అక్కడ ఎప్పటికప్పుడు మారే వాతావరణానికి తోడు రేడియేషన్, ధూళి కణాలు కలిసి రోవర్ల సోలార్ ప్యానెళ్లను కప్పేస్తాయంది. ఇలాంటి ప్రమాదకర ప్రాంతంలోనే చంద్రయాన్ 2 కూడా దిగిందని తెలిపింది. దక్షిణ ధృవంలో ఉండే ధూళి కణాలు విక్రమ్ ల్యాండర్‌కు సంకేతలోపం వచ్చిందంది. ఆ ప్రాంతం ల్యాండింగ్ కు సరైందని కాదని తెలిపింది. […]

అతి ప్రమాదకరమైన చోట దిగిన విక్రమ్ ల్యాండర్.?
Ravi Kiran
|

Updated on: Sep 10, 2019 | 1:42 PM

Share

చంద్రుడి దక్షిణ ధృవంపై అత్యంత సంక్లిష్ట పరిస్థితులు ఉంటాయని యూరోపియన్ అంతరిక్ష సంస్థ పేర్కొంది. ఆ ప్రాంతంలో ల్యాండ్ చేయడం చాలా ప్రమాదకరమని చెప్పింది. అక్కడ ఎప్పటికప్పుడు మారే వాతావరణానికి తోడు రేడియేషన్, ధూళి కణాలు కలిసి రోవర్ల సోలార్ ప్యానెళ్లను కప్పేస్తాయంది. ఇలాంటి ప్రమాదకర ప్రాంతంలోనే చంద్రయాన్ 2 కూడా దిగిందని తెలిపింది. దక్షిణ ధృవంలో ఉండే ధూళి కణాలు విక్రమ్ ల్యాండర్‌కు సంకేతలోపం వచ్చిందంది. ఆ ప్రాంతం ల్యాండింగ్ కు సరైందని కాదని తెలిపింది. అంతేకాకుండా 2018లో చంద్రయాన్ 2 లాంటి మానవ రహిత మిషన్ ఒకదానిని చంద్రుడి దక్షిణ ధృవానికి పంపే ఏర్పాటు చేశామని.. కానీ నిధుల్లేక ఆ ప్రయోగం ఆగిపోయిందని తెలిపింది.

మరోవైపు చంద్రుడి ఉపరితలంపై కూలిన విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించినట్లు ఇస్రో ఇవాళ వెల్లడించింది. తమ ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని అధికారికంగా పోస్ట్ చేసింది. చంద్ర‌యాన్‌2కు చెందిన ఆర్బిటార్‌.. విక్ర‌మ్ ప‌డిన ప్రాంతాన్ని గుర్తించిన‌ట్లు ఇస్రో పేర్కొన్న‌ది. కానీ విక్ర‌మ్ ల్యాండ‌ర్‌తో ఎటువంటి క‌మ్యూనికేష‌న్ జ‌ర‌గ‌లేద‌ని ఇస్రో చెప్పింది. దానితో క‌మ్యూనికేష‌న్ ఏర్ప‌రిచేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ఇస్రో వెల్ల‌డించింది.

Follow Us