AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్దరు మహిళా జర్నలిస్ట్‌లకు ప్రతిష్టాత్మక అవార్డులు

ప్రతిష్ఠాత్మకమైన చమేలిదేవి జైన్‌ అవార్డుకు ఈ ఏడాది ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని ప్రతి ఏటా గత 38ఏళ్లుగా అత్యుత్తమ మహిళా జర్నలిస్ట్‌లకు ఇస్తున్నారు. ఈ ఏడాది...

ఇద్దరు మహిళా జర్నలిస్ట్‌లకు ప్రతిష్టాత్మక అవార్డులు
Jyothi Gadda
|

Updated on: Mar 15, 2020 | 2:00 PM

Share

ప్రతిష్ఠాత్మకమైన చమేలిదేవి జైన్‌ అవార్డుకు ఈ ఏడాది ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఎంపికయ్యారు. ‘ద వైర్‌’ వెబ్‌సైట్‌ జర్నలిస్టు అర్ఫాఖానుం షెర్వాని, బెంగళూరుకు చెందిన ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ రోహిణి మోహ న్‌ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని ప్రతి ఏటా గత 38ఏళ్లుగా అత్యుత్తమ మహిళా జర్నలిస్ట్‌లకు ఇస్తున్నారు.

కశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌లో ఘర్షణాత్మక పరిస్థితుల్లోనూ రిపోర్టింగ్‌ చేసినందుకు గాను షెర్వానిని, అసోంలో ఎన్నార్సీపై పరిశోధనాత్మక జర్నలిజానికిగాను రోహిణి మోహన్‌ను ఎంపిక చేశారు జ్యూరీ సభ్యులు. ఈ అవార్డును తొలిసారి 1982లో ఇవ్వగా.. అప్పటి నుంచి తన పని ద్వారా వైవిధ్యం చూపిన ఒక మహిళా జర్నలిస్ట్‌కు ప్రతి సంవత్సరం అవార్డు ఇస్తారు. అవార్డు గ్రహీతలు ఇంగ్లీష్, హిందీ మరియు స్థానిక మాధ్యమాల ప్రతినిధులు. ‘అర్ఫా కా ఇండియా’ మరియు ‘హమ్ భీ భారత్’. మీడియా ఫౌండేషన్ 1980 లో అత్యుత్తమ మహిళా జర్నలిస్ట్ కోసం చమేలి దేవి జైన్ అవార్డును స్థాపించింది. మహిళా జర్నలిస్ట్‌లకు మాత్రమే చమేలి దేవి జైన్ అవార్టులు ఇస్తారు. జైలుకు వెళ్ళిన ఒక స్వాతంత్ర్య సమరయోధురాలు చమేలి దేవి.