AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk Products: పాల ఉత్పత్తుల దిగుమతిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చిచెప్పిన కేంద్రం

దేశంలో పాల ఉత్పత్తుల లీన్ సీజన్ ప్రారంభమైంది. దీంతో వీటి కొరత ఏర్పడటం వల్ల విదేశాల నుంచి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని ఇటీవల వార్త కథనాలు వచ్చాయి.

Milk Products: పాల ఉత్పత్తుల దిగుమతిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చిచెప్పిన కేంద్రం
Milk
Follow us
Aravind B

|

Updated on: Apr 09, 2023 | 11:03 AM

దేశంలో పాల ఉత్పత్తుల లీన్ సీజన్ ప్రారంభమైంది. దీంతో వీటి కొరత ఏర్పడటం వల్ల విదేశాల నుంచి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని ఇటీవల వార్త కథనాలు వచ్చాయి. అయితే ఈ విషయంపై శనివారం అధికారులు స్పందించారు. మీడియాలో వచ్చే కథనాలు అవాస్తవమని కొట్టిపారేశారు. పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలనే విషయంపై పశుసంరక్షణ విభాగం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఓ మీడియా కథనం ప్రకారం 2022-23 వ్యవధిలో భారత్ లో ప్రైవేట్ పాల ఉత్పత్తుల ఎగుమతులు వెయ్యి శాతం పెరిగి 4.77 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. నెయ్యి లాంటి కొవ్వు పదార్థాలకు అంతర్జాతీయ మార్కెట్ లో అత్యధికంగా డిమాండ్ ఉండటంతో ఇవి ఎక్కువగా విదేశాలకు దిగుమతి అయ్యాయి. ఈ కారణంగానే పాల ఉత్పత్తులు పెరిగినట్లు నివేదించింది.

అయితే 2022 డిసెంబర్ తో పోల్చుకుంటే 2023 ఫిబ్రవరిలో వెన్న, నెయ్యి నిల్వలు గణనీయంగా పెరిగాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది మార్చిలో అకాల వర్షాలు పడటం వల్ల పాల ఉత్పత్తులు పెరగడం కొనసాగాయని పశుసంవర్థక శాఖ సెక్రటరీ రాజేశ్ కుమార్ సింగ్ తెలిపారు. దీనివల్ల పాల ఉత్పత్తుల ధరలు పెరిగాయని.. కానీ వినియోగదారులపై ప్రభావం ఏర్పడిందని తెలిపారు. అయితే రైతులకు మంచి లాభాలు వస్తాయనే ఆలోచనతోనే పాల ధరలు పెంచాల్సి వచ్చిందని గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అధికారి తెలిపారు.ఏప్రిల్ మాసం నుంచి లీన్ సీజన్ ప్రారంభం కావడంతో.. పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునే విషయంపై పశు సంరక్షణ విభాగం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఈ విభాగం ఎప్పుడు కూడా ఏదైన నిర్ణయాలు తీసుకుంటే పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ముందుకు వెళ్తుందని.. రాజేశ్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

ప్రముఖ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..14మంది సజీవ దహనం..!
ప్రముఖ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..14మంది సజీవ దహనం..!
భర్తతో కలిసి బైక్‌పై వెళుతుండగా.. మెడకు చున్నీ చుట్టుకుపోయి
భర్తతో కలిసి బైక్‌పై వెళుతుండగా.. మెడకు చున్నీ చుట్టుకుపోయి
అయోధ్య రామాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన.. ఎత్తు ఎంతో తెలిస్తే..
అయోధ్య రామాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన.. ఎత్తు ఎంతో తెలిస్తే..
ఢిల్లీ ఆశలను దెబ్బ తీసిన కేకేఆర్.. టాప్-4లో కీలక మార్పులు
ఢిల్లీ ఆశలను దెబ్బ తీసిన కేకేఆర్.. టాప్-4లో కీలక మార్పులు
థియేటర్‏లో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో రచ్చ చేస్తున్న రొమాంటిక్ మూవీ.
థియేటర్‏లో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో రచ్చ చేస్తున్న రొమాంటిక్ మూవీ.
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఐపీఎల్ 2025 మధ్యలో షాకింగ్ న్యూస్.. మరణించిన 34 ఏళ్ల ప్లేయర్..
ఐపీఎల్ 2025 మధ్యలో షాకింగ్ న్యూస్.. మరణించిన 34 ఏళ్ల ప్లేయర్..
శ్రీతేజ్ పూర్తిగా కోలకున్నాడా..? హెల్త్‌ బులిటెన్‌‌లో ఏముందంటే..?
శ్రీతేజ్ పూర్తిగా కోలకున్నాడా..? హెల్త్‌ బులిటెన్‌‌లో ఏముందంటే..?
అక్షయ తృతీయ రోజు షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
అక్షయ తృతీయ రోజు షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
అప్పన్న సన్నిధిలో భారీ వర్షానికి గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి
అప్పన్న సన్నిధిలో భారీ వర్షానికి గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి