AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk Products: పాల ఉత్పత్తుల దిగుమతిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చిచెప్పిన కేంద్రం

దేశంలో పాల ఉత్పత్తుల లీన్ సీజన్ ప్రారంభమైంది. దీంతో వీటి కొరత ఏర్పడటం వల్ల విదేశాల నుంచి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని ఇటీవల వార్త కథనాలు వచ్చాయి.

Milk Products: పాల ఉత్పత్తుల దిగుమతిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చిచెప్పిన కేంద్రం
Milk
Aravind B
|

Updated on: Apr 09, 2023 | 11:03 AM

Share

దేశంలో పాల ఉత్పత్తుల లీన్ సీజన్ ప్రారంభమైంది. దీంతో వీటి కొరత ఏర్పడటం వల్ల విదేశాల నుంచి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని ఇటీవల వార్త కథనాలు వచ్చాయి. అయితే ఈ విషయంపై శనివారం అధికారులు స్పందించారు. మీడియాలో వచ్చే కథనాలు అవాస్తవమని కొట్టిపారేశారు. పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలనే విషయంపై పశుసంరక్షణ విభాగం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఓ మీడియా కథనం ప్రకారం 2022-23 వ్యవధిలో భారత్ లో ప్రైవేట్ పాల ఉత్పత్తుల ఎగుమతులు వెయ్యి శాతం పెరిగి 4.77 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. నెయ్యి లాంటి కొవ్వు పదార్థాలకు అంతర్జాతీయ మార్కెట్ లో అత్యధికంగా డిమాండ్ ఉండటంతో ఇవి ఎక్కువగా విదేశాలకు దిగుమతి అయ్యాయి. ఈ కారణంగానే పాల ఉత్పత్తులు పెరిగినట్లు నివేదించింది.

అయితే 2022 డిసెంబర్ తో పోల్చుకుంటే 2023 ఫిబ్రవరిలో వెన్న, నెయ్యి నిల్వలు గణనీయంగా పెరిగాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది మార్చిలో అకాల వర్షాలు పడటం వల్ల పాల ఉత్పత్తులు పెరగడం కొనసాగాయని పశుసంవర్థక శాఖ సెక్రటరీ రాజేశ్ కుమార్ సింగ్ తెలిపారు. దీనివల్ల పాల ఉత్పత్తుల ధరలు పెరిగాయని.. కానీ వినియోగదారులపై ప్రభావం ఏర్పడిందని తెలిపారు. అయితే రైతులకు మంచి లాభాలు వస్తాయనే ఆలోచనతోనే పాల ధరలు పెంచాల్సి వచ్చిందని గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అధికారి తెలిపారు.ఏప్రిల్ మాసం నుంచి లీన్ సీజన్ ప్రారంభం కావడంతో.. పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునే విషయంపై పశు సంరక్షణ విభాగం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఈ విభాగం ఎప్పుడు కూడా ఏదైన నిర్ణయాలు తీసుకుంటే పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ముందుకు వెళ్తుందని.. రాజేశ్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి