AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk Products: పాల ఉత్పత్తుల దిగుమతిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చిచెప్పిన కేంద్రం

దేశంలో పాల ఉత్పత్తుల లీన్ సీజన్ ప్రారంభమైంది. దీంతో వీటి కొరత ఏర్పడటం వల్ల విదేశాల నుంచి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని ఇటీవల వార్త కథనాలు వచ్చాయి.

Milk Products: పాల ఉత్పత్తుల దిగుమతిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చిచెప్పిన కేంద్రం
Milk
Aravind B
|

Updated on: Apr 09, 2023 | 11:03 AM

Share

దేశంలో పాల ఉత్పత్తుల లీన్ సీజన్ ప్రారంభమైంది. దీంతో వీటి కొరత ఏర్పడటం వల్ల విదేశాల నుంచి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని ఇటీవల వార్త కథనాలు వచ్చాయి. అయితే ఈ విషయంపై శనివారం అధికారులు స్పందించారు. మీడియాలో వచ్చే కథనాలు అవాస్తవమని కొట్టిపారేశారు. పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలనే విషయంపై పశుసంరక్షణ విభాగం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఓ మీడియా కథనం ప్రకారం 2022-23 వ్యవధిలో భారత్ లో ప్రైవేట్ పాల ఉత్పత్తుల ఎగుమతులు వెయ్యి శాతం పెరిగి 4.77 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. నెయ్యి లాంటి కొవ్వు పదార్థాలకు అంతర్జాతీయ మార్కెట్ లో అత్యధికంగా డిమాండ్ ఉండటంతో ఇవి ఎక్కువగా విదేశాలకు దిగుమతి అయ్యాయి. ఈ కారణంగానే పాల ఉత్పత్తులు పెరిగినట్లు నివేదించింది.

అయితే 2022 డిసెంబర్ తో పోల్చుకుంటే 2023 ఫిబ్రవరిలో వెన్న, నెయ్యి నిల్వలు గణనీయంగా పెరిగాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది మార్చిలో అకాల వర్షాలు పడటం వల్ల పాల ఉత్పత్తులు పెరగడం కొనసాగాయని పశుసంవర్థక శాఖ సెక్రటరీ రాజేశ్ కుమార్ సింగ్ తెలిపారు. దీనివల్ల పాల ఉత్పత్తుల ధరలు పెరిగాయని.. కానీ వినియోగదారులపై ప్రభావం ఏర్పడిందని తెలిపారు. అయితే రైతులకు మంచి లాభాలు వస్తాయనే ఆలోచనతోనే పాల ధరలు పెంచాల్సి వచ్చిందని గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అధికారి తెలిపారు.ఏప్రిల్ మాసం నుంచి లీన్ సీజన్ ప్రారంభం కావడంతో.. పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునే విషయంపై పశు సంరక్షణ విభాగం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఈ విభాగం ఎప్పుడు కూడా ఏదైన నిర్ణయాలు తీసుకుంటే పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ముందుకు వెళ్తుందని.. రాజేశ్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!